Team India: టీమిండియాకు మరో బిగ్ షాక్.. WTC పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి..!
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సెంచూరియన్ టెస్టులో టీమిండియా (Team India) ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
- By Gopichand Published Date - 12:00 PM, Fri - 29 December 23
Team India: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సెంచూరియన్ టెస్టులో టీమిండియా (Team India) ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా ఏకపక్షంగా భారత్ను ఓడించింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక కూడా పూర్తిగా మారిపోయింది. ఓడిపోవడంతో భారత జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో కిందకి పడిపోయింది. ఈ ఓటమితో దక్షిణాఫ్రికాలో తొలిసారి టెస్టు సిరీస్ను కైవసం చేసుకోవాలన్న భారత్ కల కూడా చెదిరిపోయింది. దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా భారత్ గెలవలేకపోయింది.
దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది
సెంచూరియన్ టెస్టులో టీమిండియా ఓటమితో పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానానికి చేరుకుంది. ఓటమి భారత జట్టుకు భారీ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్కు ముందు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానంలో ఉండగా.. ఇప్పుడు భారత్ ఐదో స్థానానికి చేరుకుంది. మరోవైపు సౌతాఫ్రికా చాలా లాభపడింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో దక్షిణాఫ్రికా కేవలం ఒక్క విజయంతో అగ్రస్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగే తదుపరి మ్యాచ్లో భారత్ ఓడిపోతే మళ్లీ పునరాగమనం చేయడం చాలా కష్టం. సౌతాఫ్రికా, పాకిస్థాన్, న్యూజిలాండ్ వరసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 4వ స్థానాల్లో బాంగ్లాదేశ్ ఉండగా.. ఐదో స్థానంలో టీమిండియా ఉంది.
Also Read: India Loss: టీమిండియా ఘోర పరాజయం.. సోషల్ మీడియాలో మీమ్స్ షేర్ చేస్తున్న ఫ్యాన్స్
India slips down to 5th position in WTC points table …#INDvSApic.twitter.com/oWyOiZfVyd
— Haroon Mustafa (@Haroon_HMM) December 28, 2023
రోహిత్ కెప్టెన్సీపై ప్రశ్నలు..?
ఈ ఓటమి టీమిండియాను ప్రశ్నల వలయంలోకి నెట్టింది. భారత జట్టు కెప్టెన్, బ్యాట్స్మెన్ల ప్రదర్శనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు ఇన్నింగ్స్ల్లోనూ రోహిత్ శర్మ ప్రదర్శన నిరాశపరిచింది. తొలి ఇన్నింగ్స్లో రోహిత్ 5 పరుగులు చేసినప్పటికీ, రెండో ఇన్నింగ్స్లో రోహిత్ ఖాతా తెరవలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ కెప్టెన్సీతో పాటు అతని బ్యాటింగ్పైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ రెండు ఇన్నింగ్స్ల్లోనూ రోహిత్ను అవుట్ చేశాడు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జనవరి 3 నుంచి జనవరి 7 వరకు రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలనే లక్ష్యంతో రోహిత్ సేన ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
Tags
Related News
T20 World Cup: టీమిండియాకు పట్టిన శని అంపైర్ మళ్లీ వచ్చేశాడు
అమెరికా, వెస్టిండీస్లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ తొలి రౌండ్కు 26 మంది మ్యాచ్ అధికారుల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. 28 రోజులలో 9 వేర్వేరు ప్రదేశాల్లో టోర్నీని నిర్వహిస్తున్నారు. మొత్తం 55 మ్యాచ్లు జరగనున్నాయి.