Team India Players: గాయాలతో ఇబ్బంది పడుతున్న టీమిండియా స్టార్ ఆటగాళ్లు.. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందంటే..?
కొంతమంది భారత ఆటగాళ్లు (Team India Players) చాలా కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.
- By Gopichand Published Date - 02:52 PM, Sun - 18 June 23
Team India Players: కొంతమంది భారత ఆటగాళ్లు (Team India Players) చాలా కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇందులో వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదం తర్వాత వేగంగా కోలుకుంటున్నాడు. అలాగే జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్లకు వెన్ను శస్త్రచికిత్స జరిగింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఉన్నారు.
డిసెంబర్ 2022లో జరిగిన కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. నివేదికల ప్రకారం.. పంత్ చాలా వేగంగా కోలుకుంటున్నాడు. అతని కోలుకోవడం చూసి NCA సిబ్బంది కూడా ఆశ్చర్యపోతున్నారు. వచ్చే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని పంత్ని సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది పంత్ మళ్లీ మైదానంలోకి రాలేడని చెబుతున్నారు. పంత్ ఇటీవల ఎలాంటి సపోర్టు లేకుండా మెట్లు ఎక్కడం కూడా ప్రారంభించాడు.
ఫిజియో రజనీకాంత్ ఆధ్వర్యంలో పంత్ తన దిగువ, ఎగువ శరీరం కదలికను పెంచడానికి సాధన చేస్తున్నాడు. రజనీకాంత్ చాలా అనుభవజ్ఞుడైన ఫిజియో. గతంలో హార్దిక్ పాండ్యా, మురళీ విజయ్, బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లకు గాయాల నుండి కోలుకోవడంలో సహాయపడ్డారు. అదే సమయంలో మరో NCA ఫిజియో తులసి రామ్.. పంత్ను ప్రమాదం తర్వాత ముంబైకి తీసుకువచ్చినప్పటి నుండి అతనితో ఉన్నాడు.
పంత్ ఆక్వా థెరపీ, లైట్ స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్ ద్వారా తన పునరావాసంలో తనను తాను సిద్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. పంత్ చివరిసారిగా డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్తో ఆడాడు. పంత్ జట్టులోకి ఎప్పుడు తిరిగి వస్తాడనే దానిపై అధికారికంగా స్పష్టత లేదు.
ఆసియా కప్లో బుమ్రా, అయ్యర్
నివేదికల ప్రకారం.. పేసర్ జస్ప్రీత్ బుమ్రా, కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ ఆసియా కప్ 2023లో పునరాగమనం చేయగలరు. ఇద్దరు ఆటగాళ్ళు తమ వెన్ను గాయాలతో పోరాడుతున్నారు. ఈ సంవత్సరం మొదట్లో శ్రేయాస్ అయ్యర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడిన తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. బుమ్రా తన చివరి టీ20 మ్యాచ్ను సెప్టెంబర్ 2022లో ఆస్ట్రేలియాతో ఆడాడు.
బుమ్రా తేలిగ్గా బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. ప్రధానంగా బుమ్రాకు ఫిజియోథెరపీ జరుగుతోంది. అదే సమయంలో శ్రేయాస్ అయ్యర్ కూడా ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు. ఇది కాకుండా జట్టులోని మరో ఫాస్ట్ బౌలర్ కూడా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతను కూడా పునరావాస ప్రక్రియలో ఉన్నాడు.
Related News
IPL 2024: స్పిన్నర్లపై విధ్వంసం సృష్టించిన బ్యాట్స్ మెన్లు
ఈ సీజన్లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. భారీ టార్గెట్ ఇవ్వడంలో బ్యాటర్లు విజయం సాధించడమే కాకా ఛేదనలో బౌలర్లు సైతం చెలరేగారు.అయితే కొని మ్యాచ్ ల్లో ఫాస్ట్ బౌలర్లే కాదు, స్పిన్నర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.