New Jersey: కొత్త జెర్సీలో అదిరిపోతున్న టీమిండియా ఆటగాళ్లు.. వీడియో..!
ఈ వీడియోలో టీమ్ ఇండియా బ్లూ జెర్సీ (New Jersey) కొత్త లుక్ లో కనిపిస్తోంది. ఇటీవల BCCI కిట్ స్పాన్సర్ కంపెనీని మార్చింది.
- By Gopichand Published Date - 02:01 PM, Sat - 3 June 23
New Jersey: జూన్ 7 నుంచి ఓవల్లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు బీసీసీఐ.. టీమ్ ఇండియా స్టైల్ను పూర్తిగా మార్చివేసి ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో టీమ్ ఇండియా బ్లూ జెర్సీ (New Jersey) కొత్త లుక్ లో కనిపిస్తోంది. ఇటీవల BCCI కిట్ స్పాన్సర్ కంపెనీని మార్చింది. ఆ తర్వాత ఇంగ్లాండ్లో శిక్షణ సమయంలో కూడా జట్టులోని ఆటగాళ్లు కొత్త లుక్లో కనిపించారు. ఇప్పుడు బీసీసీఐ వైట్ బాల్ జెర్సీ వీడియోను షేర్ చేసింది.
పురుషుల జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో సహా పలువురు ఆటగాళ్లు కనిపించిన వీడియోను శనివారం BCCI షేర్ చేసింది. ఇందులో విరాట్ కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా, శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, మహిళా ప్లేయర్స్ స్మృతి మంధాన, రేణుకా ఠాకూర్ కూడా ఉన్నారు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ వీడియో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రారంభించింది.
ఈ ఏడాది మే చివరిలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) 2028 సంవత్సరం వరకు కిట్ స్పాన్సర్గా అడిడాస్తో జతకట్టింది. అడిడాస్ భారత పురుషుల జట్టుతో పాటు, భారత మహిళల జట్టు, అండర్ -19 మహిళలు, పురుషుల జట్లకు కూడా జెర్సీలను అందించనుంది. 2020 సంవత్సరంలో మొబైల్ గేమింగ్ కంపెనీ MPL భారత జట్టు కిట్ స్పాన్సర్గా జతకట్టింది. ఈ డీల్ 2023 చివరి వరకు ఉంది. కానీ MPL ఈ ఒప్పందాన్ని మధ్యలోనే ముగించాలని నిర్ణయించుకుంది. దీని తర్వాత BCCI.. కిల్లర్ను 3 నెలల పాటు భారత జట్టు కిట్ స్పాన్సర్గా సంతకం చేసింది. మార్చిలో ఆస్ట్రేలియాతో సిరీస్తో ఈ ఒప్పందం ముగిసింది. దీని తర్వాత ఇప్పుడు BCCI.. 2028వ సంవత్సరం వరకు అడిడాస్తో జతకట్టింది.
The jersey that makes you feel just one thing, Impossible Is Nothing!#OwnYourStripes #adidasXBCCI #adidasTeamIndiaJersey #ImpossibleIsNothing pic.twitter.com/vhahx4q1bV
— BCCI (@BCCI) June 3, 2023
Also Read: Womens Asia Cup 2023: జూన్ 12 నుంచి మహిళల ఆసియా కప్.. జూన్ 13న హాంకాంగ్తో ఇండియా తొలి మ్యాచ్..!
ఓవల్లో టెస్టు జరగనుంది
బుధవారం నుంచి లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. టీమ్ ఇండియాకు ఇది వరుసగా రెండో ఫైనల్. గత సీజన్లో జట్టు ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. ఐసీసీ ట్రోఫీ కోసం పదేళ్ల నిరీక్షణకు ఈసారి రోహిత్ శర్మ జట్టు తెగ కష్టపడుతుంది.
WTC టీమ్ ఇండియా జట్టు: రోహిత్ శర్మ (C), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్ (WK), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జైదేవ్ ఉనద్కత్, ఇషాన్ ఉనద్కత్ (WK).
స్టాండ్బై: యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్.
Related News
Kohli Strike Rate: కోహ్లీపై విమర్శకులకు ఇచ్చి పడేసిన ఏబీడీ
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తన ఆట తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. టీ20 ఫార్మాట్కు తన స్ట్రైక్రేట్ సరిపోదని కొందరు మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి కోహ్లీ ఈ సీజన్ ఐపీఎల్ లో ఇప్పటికే 500 పరుగులు చేశాడు. బెంగళూరు భారీ స్కోరు చేయడంలోనూ కీలకపాత్ర పోషించాడు