Rohit Quit Test Cricket: రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. ఆ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్?
మెల్బోర్న్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన టీమిండియా.. కేవలం 155 పరుగులకే కుప్పకూలడంతో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్లో 184 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
- By Gopichand Published Date - 11:12 AM, Tue - 31 December 24

Rohit Quit Test Cricket: ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. సిరీస్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు జరిగాయి. సిరీస్లో టీమ్ఇండియా వెనుకబడింది. మెల్బోర్న్ టెస్టులో ఓటమి తర్వాత భారత జట్టు ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ సిరీస్ తర్వాత, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ (Rohit Quit Test Cricket) అయ్యే అవకాశం ఉందని చాలా నివేదికలు కూడా వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెల్లడించలేదు.
మెల్బోర్న్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన టీమిండియా.. కేవలం 155 పరుగులకే కుప్పకూలడంతో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్లో 184 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు చివరి మ్యాచ్ జనవరి 3 నుంచి సిడ్నీలో జరగనుంది. మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై వార్తలు వస్తున్నాయి.
సిడ్నీ టెస్టు తర్వాత రోహిత్ శర్మ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ టెస్ట్ మ్యాచ్ ఐదు రోజుల పాటు కొనసాగితే జనవరి 7, 2025న రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. రోహిత్ కెప్టెన్సీలో భారత్ గత 6 మ్యాచ్ల్లో ఒక్క టెస్టు కూడా గెలవలేకపోయింది. అడిలైడ్, మెల్బోర్న్లలో ఓటమికి ముందు న్యూజిలాండ్పై రోహిత్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది.
15 ఇన్నింగ్స్ల్లో 164 పరుగులు మాత్రమే చేశాడు
జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో పెర్త్ టెస్టులో టీమిండియా విజయం సాధించింది. వ్యక్తిగత కారణాల వల్ల ఆ టెస్టు మ్యాచ్లో రోహిత్ ఆడలేదు. సెప్టెంబరులో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో కూడా టీమిండియా కెప్టెన్ రోహిత్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 15 ఇన్నింగ్స్ల్లో 10.93 సగటుతో 164 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, రోహిత్ శర్మ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్ ఆడాలనుకుంటున్నాడు. ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత్ చేరుకుంటే అదే అతడికి చివరి మ్యాచ్ కావచ్చు. ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గో టెస్టులో ఓటమి తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. వ్యక్తిగత స్థాయిలో కొన్ని ‘విషయాలు’ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. పేలవ ఫామ్లో ఉన్న రోహిత్ మూడు టెస్టు మ్యాచ్ల్లో ఆరు ఇన్నింగ్స్ల్లో 31 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో జస్ప్రీత్ బుమ్రా తీసిన 30 వికెట్ల కంటే అతని పరుగుల సంఖ్య కేవలం ఒకటి మాత్రమే ఎక్కువ.
అయితే సిడ్నీ టెస్టు తర్వాత రోహిత్ టెస్టులకు కూడా గుడ్ బై చెప్పనున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అతను ఈ విషయాన్ని బోర్డుకు కూడా చెప్పినట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే టీమిండియాకు టెస్టు కెప్టెన్గా బుమ్రా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.