Rohit Sharma: ఆసియా కప్ మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ షాకింగ్ పోస్ట్!
భారత వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్కు ముందు కఠిన సాధన చేస్తున్నాడు. భారత జట్టు అక్టోబర్-నవంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
- Author : Gopichand
Date : 10-09-2025 - 7:13 IST
Published By : Hashtagu Telugu Desk
Rohit Sharma: ఆసియా కప్ 2025లో ఈరోజు భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (IND vs UAE) మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కీలక మ్యాచ్కు ముందు భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఆసియా కప్లో టీమ్ ఇండియా మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్యాడ్స్ ధరించి బ్యాటింగ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఆ పోస్ట్లో కనిపించింది. ఈ పోస్ట్తో రోహిత్ అభిమానుల్లో ఒకరకమైన ఉత్సాహం మొదలైంది.
టెస్ట్, టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అతను ఇప్పటికీ భారత వన్డే జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసిన ఒక ఫోటోలో ముంబై ఇండియన్స్ జట్టు డ్రెస్సింగ్ రూమ్లో ప్యాడ్స్ ధరించి బ్యాటింగ్కు సిద్ధమవుతున్నట్లుగా కనిపించాడు. ఈ పోస్ట్ ద్వారా రోహిత్ భారత జట్టు తదుపరి వన్డే సిరీస్కు ముందు ప్రాక్టీస్లో నిమగ్నమైనట్లు స్పష్టమవుతోంది.
Also Read: Megastar Chiranjeevi: వరుణ్ తేజ్-లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్.. మనువడితో చిరంజీవి!
ఆస్ట్రేలియా సిరీస్కు రోహిత్ సిద్ధం
భారత వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్కు ముందు కఠిన సాధన చేస్తున్నాడు. భారత జట్టు అక్టోబర్-నవంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్ వన్డే, టీ20 సిరీస్లు ఆడనుంది. వన్డే సిరీస్కు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా, ఆసియా కప్ తరహాలోనే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్కు కూడా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్లో రెండు ఫోటోలను షేర్ చేశాడు. ఒక ఫోటోలో అతను రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు, మరొక ఫోటోలో బ్యాటింగ్ ప్యాడ్స్ ధరిస్తున్నట్లుగా ఉన్నాయి. ఈ పోస్ట్లు రాబోయే సిరీస్కు రోహిత్ ఎంత సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నాడో తెలియజేస్తున్నాయి.