Rohit Sharma: రోహిత్ శర్మకు క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టే ఛాన్స్..!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఈసారి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇప్పుడు క్రిస్ గేల్ పాత రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం వచ్చింది రోహిత్ శర్మకి.
- By Gopichand Published Date - 12:52 PM, Sat - 11 November 23
Rohit Sharma: 2023 ప్రపంచకప్లో భారత్, నెదర్లాండ్స్ మధ్య బెంగళూరులో 45వ మ్యాచ్ జరగనుంది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్కు ఇరు జట్లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. ఈ ప్రపంచకప్లో మొదటి సెమీఫైనల్కు ముందు ఇదే చివరి మ్యాచ్. భారత జట్టు సెమీఫైనల్కు చేరుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఈసారి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇప్పుడు క్రిస్ గేల్ పాత రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం వచ్చింది రోహిత్ శర్మకి.
ప్రపంచకప్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు గేల్ పేరిట ఉంది. 2015 వన్డే ప్రపంచకప్లో గేల్ 26 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ, గ్లెన్ మాక్స్వెల్ రెండో స్థానంలో ఉన్నారు. గేల్ రికార్డును బద్దలు కొట్టాలంటే రోహిత్కు ఐదు సిక్సర్లు కావాలి. ఈసారి ప్రపంచకప్లో రోహిత్ 22 సిక్సర్లు కొట్టాడు. మ్యాక్స్వెల్ కూడా 22 సిక్సర్లు కూడా కొట్టాడు. ఈ విషయంలో మోర్గాన్ కూడా రెండో స్థానంలో ఉన్నాడు. 2019లో 22 సిక్సర్లు కొట్టాడు. క్వింటన్ డి కాక్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈసారి డి కాక్ 21 సిక్సర్లు కొట్టాడు.
2023 ప్రపంచకప్లో ఇప్పటివరకు రోహిత్ శర్మ ప్రదర్శనను పరిశీలిస్తే అద్భుతంగా రాణిస్తున్నాడు. 8 మ్యాచ్లు ఆడిన రోహిత్ 442 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 50 ఫోర్లు, 22 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు కూడా చేశాడు. ఈసారి అతను అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
భారత్ ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించడం గమనార్హం. పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. టీమిండియా తన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 15న ఆడనుంది. నెదర్లాండ్స్తో మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబైలో టీమిండియా సెమీస్ ఆడనుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
Related News
India squad: టీ20 ప్రపంచకప్.. టీమిండియా జట్టు ప్రకటనకు మూహర్తం ఫిక్స్..!
పలువురు మాజీ క్రికెటర్లు కూడా తమ ఎంపిక మేరకు 15 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియా జట్టును ఎంపిక చేశారు. అయితే మీడియా కథనాల ప్రకారం ఏప్రిల్ 29 లేదా మే 1న బీసీసీఐ టీమ్ ఇండియాను ప్రకటించవచ్చు.