Rishabh Pant: రిషబ్ పంత్కు షాక్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. కెప్టెన్గా మరో ఆటగాడు..!
నిజానికి 'టైమ్స్ ఆఫ్ ఇండియా' వార్తల ప్రకారం.. IPL 2025లో రిషబ్ పంత్కు జట్టు కెప్టెన్సీని ఢిల్లీ క్యాపిటల్స్ ఇవ్వాలనుకోలేదు. ఢిల్లీ కొత్త కెప్టెన్ కోసం అన్వేషణలో ఉంది. పంత్ తర్వాత భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కెప్టెన్సీ రేసులో ముందున్నాడు.
- Author : Gopichand
Date : 18-10-2024 - 12:10 IST
Published By : Hashtagu Telugu Desk
Rishabh Pant: IPL 2025 మెగా వేలానికి ముందు పెద్ద న్యూస్ బయటకు వస్తోంది. నివేదికల ప్రకారం.. ఈ సీజన్లో రిషబ్ పంత్ (Rishabh Pant) ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఉండడు. ఢిల్లీ జట్టు కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది. ఈ రేసులో భారత ఆటగాడి పేరు ముందంజలో ఉంది. కెప్టెన్సీ ఒత్తిడి నుంచి విముక్తి పొందిన తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మరింత రాణించగలడని ఢిల్లీ టీమ్ మేనేజ్మెంట్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. గత సీజన్లో పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఢిల్లీ జట్టు 14 మ్యాచ్ల్లో ఏడింటిలో విజయం సాధించగా, అదే సంఖ్యలో మ్యాచ్ల్లో జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. గతేడాది టోర్నీలో ఢిల్లీ ఆరో స్థానంతో ముగించింది.
నిజానికి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వార్తల ప్రకారం.. IPL 2025లో రిషబ్ పంత్కు జట్టు కెప్టెన్సీని ఢిల్లీ క్యాపిటల్స్ ఇవ్వాలనుకోలేదు. ఢిల్లీ కొత్త కెప్టెన్ కోసం అన్వేషణలో ఉంది. పంత్ తర్వాత భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కెప్టెన్సీ రేసులో ముందున్నాడు. జట్టు అక్షర్పై విశ్వాసం ఉంచకపోతే మెగా వేలంలో జట్టుకు బాధ్యత వహించే ఆటగాడిపై ఢిల్లీ బెట్టింగ్లు జరుపుతుంది. కెప్టెన్సీ లేకుండా పంత్ మెరుగైన ప్రదర్శన చేయగలడని ఢిల్లీ జట్టు నాయకత్వ బృందం అభిప్రాయపడింది.
Also Read: T20 World Cup: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఫైనల్కు చేరిన సౌతాఫ్రికా
మూడేళ్లుగా జట్టు ప్లేఆఫ్కు చేరుకోలేదు
ఢిల్లీ క్యాపిటల్స్ చివరిసారిగా 2021లో ప్లేఆఫ్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత మూడు సీజన్లలో ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. 2020లో ఢిల్లీ ఫైనల్స్కు చేరుకున్నప్పుడు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో జట్టు ప్రదర్శన అత్యుత్తమంగా ఉంది. ఐపీఎల్ 2024లో ఢిల్లీ జట్టు, కెప్టెన్ పంత్ ఢిల్లీని ఉత్తమ స్థానంలో ఉంచలేకపోయారు.
తాజాగా రిషబ్ పంత్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఓ పోస్ట్ను పంచుకున్నాడు. తాను వేలానికి వెళితే అమ్ముడుపోతానా లేదా అని..? ఒకవేళ అమ్ముడుపోతే తన పేరుకు ఎంత ధర పలకాలని అభిమానులను అడిగాడు పంత్. రిషబ్ ఈ పోస్ట్పై చాలా సమాధానాలు వచ్చాయి. అయితే, నివేదికలను విశ్వసిస్తే మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ను కొనసాగించాలని నిర్ణయించుకుంది.