Virat Kohli RCB : మళ్ళీ కోహ్లీకే RCB పగ్గాలు ?
ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఫ్రాంచైజీలు సన్నాహాలు మొదలుపెట్టేశాయి.
- By Hashtag U Published Date - 01:23 PM, Fri - 28 January 22
ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఫ్రాంచైజీలు సన్నాహాలు మొదలుపెట్టేశాయి. ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరిగే వేలంతో జట్టు కూర్పును సిద్ధం చేసుకోనుండగా… కొత్త కోచ్ , కెప్టెన్ల పైనా నెమ్మదిగా క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీమ్ కెప్టెన్ గా ఈ సారి ఎవరు ఉండబోతున్నారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2021 సీజన్ తర్వాత రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు కెప్టెన్సీకి విరాట్ కోహ్లి గుడ్ బై చెప్పేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్ గామారింది ఐపీఎల్ 2022 సీజన్ లో ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ విరాట్ కోహ్లీనే ఉంటాడని సమాచారం. ఈ మేరకు ఆర్సీబీ యాజమాన్యం ఇప్పటికే కోహ్లితో చర్చలు జరిపినాట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఛైర్మన్ ప్రథమేశ్ మిశ్రా కూడా ధృవీకరించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుని విరాట్ కోహ్లీ కొన్ని సీజన్లలో అద్భుతంగా ముందుకు నడిపించాడని గుర్తుచేశాడు. కోహ్లీ సారథ్యంలో బెంగళూరు జట్టు చాలా మ్యాచ్లను గెలిచిందని, ఇప్పటికీ కూడా అతనికే ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్టు వెల్లడించాడు. గత ఏడాది కెప్టెన్సీ నుండి తప్పుకున్నప్పటకీ.. మళ్ళీ ఆ బాధ్యతలు తీసుకునేలా కోహ్లీని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని మిశ్రా తెలిపారు. 2013 నుంచి ఆర్సీబీ కెప్టెన్గా ఉన్న కోహ్లి.. ఒక్కసారి కూడా జట్టును ఛాంపియన్ గా నిలపలేకపోయాడు. దీంతో గత ఏడాది కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన విరాట్ ఇకపై కేవలం బ్యాట్స్మెన్గా మాత్రమే జట్టులో కొనసాగుతానని తేల్చిచెప్పాడు. అయితే ఫ్రాంచైజీ మాత్రం మళ్ళీ కెప్టెన్సీ పగ్గాలు అందించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కోహ్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Related News
Royal Challengers Bengaluru: ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరుకోవాలంటే.. ఇలా జరగాల్సిందే..!
బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. RCB- CSK మధ్య జరిగే ఈ మ్యాచ్ ఫైనల్కు ఉండే క్రేజ్ను సాధించింది.