IPL Heat: ఐపీఎల్ వేడి.. 27న రాత్రి “రాయల్స్” ఢీ : గ్రేమ్ స్మిత్, రవిశాస్త్రి
రెండు " రాయల్స్" టీమ్ ల మధ్య శుక్రవారం రాత్రి రసవత్తర ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. కీలకమైన క్వాలిఫయ్యర్ -2 రౌండ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ లు ఢీకొననున్నాయి.
- By Hashtag U Published Date - 10:46 PM, Thu - 26 May 22
రెండు ” రాయల్స్” టీమ్ ల మధ్య శుక్రవారం రాత్రి రసవత్తర ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. కీలకమైన క్వాలిఫయ్యర్ -2 రౌండ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ లు ఢీకొననున్నాయి. దీని పై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ మాజీ ప్లేయర్ గ్రేమ్ స్మిత్, భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
క్వాలిఫయ్యర్ -2 మ్యాచ్ లో ఎలాగైనా గెలిచేందుకు రాజస్థాన్ రాయల్స్ సర్వ శక్తులు ఒడ్డుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభ కాలం 2008లో ట్రోఫీ ని గెలుచుకున్న రాజస్థాన్ రాయల్స్.. మళ్లీ ఇప్పుడు కప్ ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోందని పేర్కొన్నారు. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఒక్కసారి కూడా కప్ ను గెలవలేదని, కనీసం ఈసారైనా గెలిచి తీరాలనే కృత నిశ్చయంతో ఉందని రవిశాస్త్రి విశ్లేషించారు. ఈనేపథ్యంలో శుక్రవారం రాత్రి రెండు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ ప్రేక్షకులకు కనుల పండువగా నిలిచిపోతుందని ఆయన అభివర్ణించారు.
Related News
RCB vs GT: ఐపీఎల్లో నేడు మరో ఉత్కంఠ పోరు.. గుజరాత్ వర్సెస్ బెంగళూరు..!
ఐపీఎల్లో శనివారం (మే 4) ఒక్క మ్యాచ్ మాత్రమే జరగనుంది. ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో వారి స్వదేశంలో తలపడుతుంది.