FIFA WC 2022: రేపటి నుంచే సాకర్ సంగ్రామం..!
32 జట్లు.. ఒక ఛాంపియన్.. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులకు ఇక పండుగే పండుగ.
- By Gopichand Published Date - 02:28 PM, Sat - 19 November 22
32 జట్లు.. ఒక ఛాంపియన్.. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులకు ఇక పండుగే పండుగ.. నెలరోజుల పాటు ఫిఫా వరల్డ్ కప్ ఫ్యాన్స్ ను అలరించబోతోంది. మెస్సీ , రొనాల్డో వంటి స్టార్ ప్లేయర్స్ ఆట మాయలో పడి మునిగితేలేందుకు అభిమానులు కూడా సిద్ధమైపోయారు. ఆదివారం ఖతార్ వేదికగా సాకర్ మహాసంగ్రామానికి తెరలేవబోతోంది. ఫుట్ బాల్ చరిత్రలోనే తొలిసారిగా ఖతర్ ప్రపంచకప్ కు ఆతిథ్యమివ్వనుంది. మొత్తం 32 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఆదివారం జరిగే తొలి మ్యాచ్ లో ఈక్వెడార్ తో ఆతిథ్య ఖతర్ జట్టు తలపడనుంది.
ఫుట్ బాల్ ప్రపంచకప్ లో ఆడటం ఖతర్ కు ఇదే తొలిసారి. ఆతిథ్య దేశం హోదాలో ఖతర్ ప్రపంచకప్ కు అర్హత సాధించింది. ఈ ప్రపంచకప్ కోసం మొత్తంగా 7 అత్యాధునిక స్టేడియాలను ఖతార్ సిద్ధం చేసింది. గతేడాది యూరో కప్ చాంపియన్ గా నిలిచిన ఇటలీ ఈ ప్రపంచకప్ కు అర్హత సాధించలేకపోయింది. 32 జట్లను ఎనిమిది గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో గ్రూపులోని ప్రతి జట్టూ మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్టు నాకౌట్కు అర్హత సాధిస్తాయి. మొత్తం 16 జట్లు ప్రిక్వార్టర్స్లో తలపడతాయి.
అక్కడి నుంచి క్వార్టర్స్ , సెమీస్, ఫైనల్ జరగనున్నాయి. 5 నగరాల్లోని 8 స్టేడియాల్లో మొత్తం 64 మ్యాచ్ లు ఫ్యాన్స్ ను అలరించనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ గా ఫ్రాన్స్ బరిలోకి దిగనుంది. అయితే ఈసారి మాత్రం టైటిల్ ఫేవరెట్ గా బ్రెజిల్ పై అంచనాలున్నాయి.అలాగే ఇంగ్లండ్, స్పెయిన్, అర్జెంటీనాలు కూడా టైటిల్ రేసులో పోటీపడుతున్నాయి. అక్కడ అధిక ఊష్ణోగ్రతల కారణంగా శీతాకాలంలో టోర్నీని నిర్వహిస్తున్నారు. అక్కడి ఊష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం స్టేడియాలన్నింటిలోనూ ఏసీలు ఏర్పాటు చేశారు. ఎక్కువ వ్యయంతో తక్కువ రోజుల్లో ముగిసే ప్రపంచకప్ ఇదే. రిటైర్మెంట్ కు చేరువలో ఉన్న పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డోతో పాటు అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీకి ఇదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉంది. దీంతో తమ దేశాలకు టైటిల్ అందించాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతున్నారు.
Related News
YouTuber Died: పాపులర్ యూట్యూబర్ యాంగ్రీ రాంట్మాన్ మృతి
యాంగ్రీ రాంట్మన్గా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ అబ్రదీప్ సాహా అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. అబ్రదీప్ సాహా గత కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపపడుతున్నాడు. గత నెలలో శస్త్రచికిత్స చేయించుకున్నప్పటి ఫలితం లేకుండాపోయింది.