PM Modi: ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ కు ప్రధాని మోదీ.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ కూడా..!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఈ నెలలో భారత్ (India)లో పర్యటించనుంది. ఈ జట్టు ఫిబ్రవరి 9న ప్రారంభమయ్యే నాలుగు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ను ఇక్కడ ఆడాల్సి ఉంది. సిరీస్లోని చివరి టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరగనుంది. ఈ మ్యాచ్ను చూడటానికి ఇద్దరు ప్రత్యేక అతిథులు రానున్నారు.
- By Gopichand Published Date - 06:55 AM, Fri - 3 February 23
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఈ నెలలో భారత్ (India)లో పర్యటించనుంది. ఈ జట్టు ఫిబ్రవరి 9న ప్రారంభమయ్యే నాలుగు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ను ఇక్కడ ఆడాల్సి ఉంది. సిరీస్లోని చివరి టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరగనుంది. ఈ మ్యాచ్ను చూడటానికి ఇద్దరు ప్రత్యేక అతిథులు రానున్నారు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి టెస్ట్ సిరీస్ జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కు చేరాలంటే ఈ సిరీస్ భారత్ కు చాలా కీలకం. దీంతో ఆసీస్ పై ఎలగైనా గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది.
అయితే, చివరిదైన నాలుగో టెస్ట్ మ్యాచ్ మార్చి 9న అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కు ప్రధాని మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ హాజరవుతారని తెలుస్తోంది. మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్లో జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ రానున్నారు. ఓ ఆంగ్ల పత్రిక తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. భారత ప్రధాని పేరిట ఉన్న స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ స్టేడియానికి మోడీ పేరు పెట్టినప్పటి నుండి, అతను ఈ స్టేడియంలో మ్యాచ్ చూడటం ఇదే మొదటిసారి.
Also Read: CM Kejriwal: లిక్కర్ స్కామ్ చార్జ్షీట్ లో కేజ్రీవాల్ పేరు
ఈ సిరీస్లో తొలి టెస్టు నాగ్పూర్లో జరగనుంది. ఆ తర్వాత ఢిల్లీలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల మూడో టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సిరీస్లో గెలిచి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాలని భారత్ భావిస్తోంది. ఈ సిరీస్ గెలిస్తే భారత్ ఫైనల్ చేరుతుంది. అదే సమయంలో భారత్లో టెస్టు సిరీస్ను కైవసం చేసుకునేందుకు ఆస్ట్రేలియా తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
Related News
Narendra Modi : కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలదా
బలహీనమైన ప్రభుత్వం బలమైన దేశాన్ని తయారు చేయగలదా, కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలదా అని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రశ్నించారు.