Pakistan Players Salary: పాకిస్తాన్ ఆటగాళ్లకు నాలుగు నెలలుగా జీతాల్లేవ్..!?
2023 వన్డే ప్రపంచకప్కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు మరో సమస్యను ఎదుర్కొంటోంది. నివేదికల ప్రకారం.. గత నాలుగు నెలలుగా పాకిస్తాన్ ఆటగాళ్లకు జీతాలు (Pakistan Players Salary) అందలేదట.
- By Gopichand Published Date - 07:56 PM, Sun - 24 September 23
Pakistan Players Salary: 2023 వన్డే ప్రపంచకప్కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు మరో సమస్యను ఎదుర్కొంటోంది. నివేదికల ప్రకారం.. గత నాలుగు నెలలుగా పాకిస్తాన్ ఆటగాళ్లకు జీతాలు (Pakistan Players Salary) అందలేదట. జీతాలు చెల్లించకపోవడంతో జట్టు ఆటగాళ్లు ప్రపంచకప్ ప్రమోషన్, స్పాన్సర్షిప్ లోగోలను బహిష్కరిస్తామని బెదిరిస్తున్నారని సమాచారం. ఇది ప్రపంచకప్కు ముందు పాకిస్థాన్కు పెద్ద సమస్యను సృష్టించే అవకాశం ఉంది.
‘క్రికెట్ పాకిస్థాన్’ నివేదిక ప్రకారం.. గత నాలుగు నెలలుగా పాకిస్తాన్ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు లేదా జీతాలు అందలేదని పేర్కొంది. దీని కారణంగా ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఆటగాళ్ల జీతాల్లో చారిత్రాత్మకమైన పెంపుదల ఉంటుందని ఇంతకుముందు పలు నివేదికల్లో పేర్కొన్నాయి. అయితే కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ పై ఇంకా ఆటగాళ్లు సంతకం చేయలేదని సమాచారం.
Also Read: Team India Score: టీమిండియా భారీ స్కోర్.. సిక్సులు, ఫోర్లతో హోరెత్తిన స్టేడియం..!
గోప్యతను కొనసాగించాలనే షరతుపై పాకిస్తాన్ జట్టులోని ఒక ఆటగాడు ‘క్రికెట్ పాకిస్తాన్’తో ఇలా అన్నాడు. “మేము పాకిస్తాన్కు ఉచితంగా ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే బోర్డుతో సంబంధం ఉన్న స్పాన్సర్షిప్ వ్యక్తులను ఎందుకు ప్రోత్సహించాలి అనేది ప్రశ్న.. అదేవిధంగా మేము ప్రచార కార్యకలాపాలు, ఇతర కార్యక్రమాలలో పాల్గొనడానికి నిరాకరించవచ్చు. “ప్రపంచ కప్ సమయంలో మేము ICC వాణిజ్య ప్రమోషన్లు, కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండము” అని పేర్కొన్నాడు. ఐసిసి, స్పాన్సర్ల నుండి వచ్చే ఆదాయంలో వాటాను ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారని నివేదిక పేర్కొంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ICC, స్పాన్సర్ల నుండి దాదాపు రూ.9.8 బిలియన్లను పొందుతుంది.
ప్రపంచకప్లో పాక్ తొలి మ్యాచ్ అక్టోబర్ 6న జరగనుంది
బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు 2023 ప్రపంచకప్లో నెదర్లాండ్స్తో అక్టోబర్ 6న హైదరాబాద్లో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. దీని తర్వాత అక్టోబర్ 10న హైదరాబాద్లోనే శ్రీలంకతో రెండో మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జట్టు అహ్మదాబాద్ చేరుకుంటుంది. అక్కడ అక్టోబర్ 14న భారత్తో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Tags
Related News
Viral : హనుమాన్ ఆలయాన్ని పబ్లిక్ టాయిలెట్గా మార్చేశారు ..
అన్యాయంగా హనుమాన్ టెంపుల్ని పబ్లిక్ టాయిలెట్గా మార్చేశారు