MS Dhoni: ధోనీ ఫ్యాన్స్ కు తీపి కబురు.. 2025 ఐపీఎల్ లో ధోనీ కన్ఫర్మ్
ఈ సీజన్ ఐపీఎల్ అందరి చూపు మహేంద్ర సింగ్ ధోనీ పైనే ఉంది. ధోనీకి ఇది చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాహీ చివరి మ్యాచ్ లను చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో చెన్నై ఆడే మైదానాల్లో ఫ్యాన్స్ తో ఎల్లోమయం అయిపోతుంది.
- By Praveen Aluthuru Published Date - 07:30 PM, Wed - 17 April 24
MS Dhoni: ఈ సీజన్ ఐపీఎల్ లో అందరి చూపు మహేంద్ర సింగ్ ధోనీ పైనే ఉంది. ధోనీకి ఇది చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాహీ చివరి మ్యాచ్ లను చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో చెన్నై ఆడే మైదానాలు ఫ్యాన్స్ తో ఎల్లోమయం అయిపోతున్నాయి. ఒక్కప్పుడు చెన్నై చెపాక్ ధోనీ అభిమానులతో నిండిపోయేది. ఇప్పుడు ధోనీ ఎక్కడుంటే అక్కడుంటాం అంటున్నారు ఫ్యాన్స్. ఇక ధోనీ బ్యాటింగ్ చేసే సమయానికి డిజిటల్ వ్యూస్ ఓ రేంజ్ కి పెరిగిపోతున్నాయి. ఆడేది రెండు లేదా బంతులే అయినప్పటికీ ధోనీ మైదానంలో ఉంటే చాలనుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక తాజాగా ధోనీ ముంబైపై వరుసగా మూడు సిక్సులు బాదిన విషయం తెలిసిందే. ఆ ఇన్నింగ్స్ ద్వారా ధోనీ తన పాత వైభవాన్ని మరొకసారి రుచి చూపించాడు. పైగా ధోనీ వచ్చే ఐపీఎల్ లోనూ ఆడుతాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నిజానికి గతేడాది జరిగిన ఐపీఎల్ ధోనీకి చివరి సీజన్ అనుకున్నారు. ఆ సీజన్లో ధోనీ గాయంతోనే జట్టుని ముందుకు నడిపించాడు. ధోనీ సారధ్యంలో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 5 ట్రోపీలు అందుకుంది. అంతకుముందు రోహిత్ శర్మ సారధ్యంలో ముంబై ఇండియన్స్ ఐదు ఐపీఎల్ ట్రోపీలు అందుకుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ధోనీ మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. వచ్చి రాగానే బ్యాట్ ఝళిపిస్తున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ ఇచ్చినప్పటికీ ధోనీ వికెట్ల వెనుకాల నిల్చుని డైరక్షన్స్ ఇస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే వచ్చే సీజన్లో ధోనీ ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. తాజాగా ధోనీ స్నేహితుడు సురేష్ రైనా మాట్లాడుతూ వచ్చే ఐపీఎల్ లో ధోనీ ఆడుతాడంటూ హాట్ కామెంట్స్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
జియో సినిమా ప్రోగ్రామ్ లో సురేష్ రైనా మరియు ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ లో ధోని ఐపీఎల్ భవిష్యత్తు గురించి చర్చ జరిగింది. ఈ సమయంలో యాంకర్ రైనా ఆర్పీ సింగ్ని ఇది ధోనీకి చివరి ఐపిఎల్ సీజన్ కాదా అని అడిగాడు. ఆర్పీ సింగ్ మాట్లాడుతూ ఇది తన చివరి సీజన్ అని అనిపించడం లేదని చెప్పాడు. అప్పుడు సురేష్ సురేష్ రైనా మాట్లాడుతూ ధోనీ తప్పకుండ మరొక సీజన్ ఆడుతాడని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే వెంటనే ఆర్పీ సింగ్ కలుగజేసుకుని లేదు లేదు ధోనీ ఒకటి కాదు రెండు సీజన్లు ఆడే అవకాశం కనిపిస్తుందంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: T.BJP : గ్రేటర్ హైదరాబాద్, దక్షిణ తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం కష్టమేనా..?
Related News
IPL Playoff Scenarios: ఆసక్తికరంగా ప్లే ఆఫ్ రేస్…
ఐపీఎల్ 17వ సీజన్ సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్లు ఆయా జట్లకు కీలకంగా ఉన్న నేపథ్యంలో విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఏ జట్టు కూడా తగ్గేదే లేదు అంటూ సత్తా చాటుతుండడంతో ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది.