MS Dhoni And Virat Kohli: ధోనీ, కోహ్లీలను చూసి ఫ్యాన్స్ ఖుష్.. మ్యాచ్ అనంతరం వీరిద్దరూ ముచ్చటిస్తున్న వీడియో వైరల్..!
ఐపీఎల్ 2023లో 24వ మ్యాచ్లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ (Chennai Super Kings), బెంగళూరు (Bengaluru)తో జరిగిన మ్యాచ్లో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- By Gopichand Published Date - 07:38 AM, Tue - 18 April 23
ఐపీఎల్ 2023లో 24వ మ్యాచ్లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ (Chennai Super Kings), బెంగళూరు (Bengaluru)తో జరిగిన మ్యాచ్లో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. RCB ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli ) నిరాశగా కనిపించాడు. కానీ కొంత సమయం తర్వాత అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది. మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లి డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఎంఎస్ ధోనీని కలిసేందుకు వెళ్లాడు. వీరిద్దరినీ కలిసి చూసిన ఎం.చిన్నస్వామి స్టేడియం వద్ద ఉన్న అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈ సమయంలో మహి, కింగ్ కోహ్లి మ్యాచ్ కొన్ని క్షణాలను గుర్తు చేసుకుంటూ నవ్వుతూ కనిపించారు.
Two GOATs of the indian cricket.#MSDhoni𓃵 & #ViratKohlipic.twitter.com/DuAAEztYcZ
— ROMEO👑 (@iromeostark) April 17, 2023
ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి కలిసి ఉండటంతో అభిమానులు చాలా సంతోషించారు. చెన్నై సూపర్ కింగ్స్పై కోహ్లీ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీని తర్వాత RCB కెప్టెన్ ఫాఫ్ డుప్లెసీ, గ్లెన్ మాక్స్వెల్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. ఒకానొక సమయంలో బెంగళూరు జట్టు మ్యాచ్ను సులభంగా గెలుస్తుందని అనిపించింది. అయితే ఈ ఇద్దరూ కీలక సందర్భాలలో అవుట్ అయ్యార. ఆ తర్వాత మ్యాచ్ సమీకరణం మారిపోయింది.
Also Read: CSK vs RCB: హై స్కోరింగ్ క్లాష్ లో చెన్నైదే విక్టరీ
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. CSK తరపున న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ డెవాన్ కాన్వే, శివమ్ దూబే తుఫాను ఇన్నింగ్స్ ఆడారు. కాన్వాయ్ 83, శివమ్ దూబే 52 పరుగులు చేశారు. ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో అభిమానులు పరుగుల వర్షం చూశారు. ఇరు జట్ల బ్యాట్స్మెన్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. మొత్తం మ్యాచ్లో 33 సిక్సర్లు నమోదయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్మెన్ గ్లెన్ మాక్స్వెల్ గరిష్టంగా 8 సిక్సర్లు బాదాడు. మ్యాక్స్ వెల్ 36 బంతుల్లో 76 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతని ఇన్నింగ్స్ కూడా RCBని గెలిపించలేకపోయింది. ఉత్కంఠభరితమైన మ్యాచ్లో చెన్నై 8 పరుగుల తేడాతో RCBని ఓడించింది.
Tags
Related News
IPL 2024: ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు, సిక్సులు, వికెట్లు తీసిన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ -2024 లీగ్ రౌండ్ ముగిసింది. ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది.