Kohli vs Gambhir: గొడవ జరిగిన రోజు కోహ్లీ, గంభీర్ మధ్య జరిగిన సంభాషణ ఇదే..!
మ్యాచ్ తర్వాత విరాట్, లక్నో జట్టు మెంటర్ గౌతం గంభీర్ (Kohli vs Gambhir)తో గొడవపడ్డాడు. ఈ వివాదాల తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయారు.
- Author : Gopichand
Date : 03-05-2023 - 8:26 IST
Published By : Hashtagu Telugu Desk
ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్లో పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ, లక్నో ఆటగాడు నవీన్-ఉల్-హక్ మధ్య గొడవ జరిగింది. మ్యాచ్ తర్వాత విరాట్, లక్నో జట్టు మెంటర్ గౌతం గంభీర్ (Kohli vs Gambhir)తో గొడవపడ్డాడు. ఈ వివాదాల తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు విరాట్ పక్షం వహిస్తే, మరికొందరు నవీన్-గంభీర్ పక్షం వహిస్తున్నారు.
అయితే ఈ వివాదంలో కోహ్లీ, గంభీర్ మధ్య జరిగిన సంభాషణ ఏమిటనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ మొత్తం ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఒకరు వార్తా సంస్థ పీటీఐకి సమాచారం అందించారు. ఈ వివాదంలో కోహ్లీ, గంభీర్ మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో చెప్పాడు. మ్యాచ్ తర్వాత కోహ్లీతో మాట్లాడకుండా కైల్ మేయర్లను గంభీర్ ఎందుకు నిషేధించాడో కూడా ఆయన చెప్పారు.
ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. విరాట్ మిగిలిన ఆటగాళ్లతో కరచాలనం చేసి తిరిగి వస్తున్నప్పుడు లక్నో ఆటగాడు మేయర్.. కోహ్లీతో ఏదో చెప్పడం మీరు టీవీలో చూసి ఉంటారు. అంతకుముందు నవీన్-ఉల్-హక్ను విరాట్ దుర్భాషలాడడంపై అమిత్ మిశ్రా అంపైర్కు ఫిర్యాదు చేశారు. అయితే విరాట్, మేయర్స్ మధ్య గొడవ జరగకూడదని గంభీర్ పక్కకి తీసుకెళ్లాడు అని చెప్పారు.
गौतम गंभीर ने हार से खीझ कर #विराट_कोहली से पंगा ले लिया।
फिर क्या था,विराट ने सही से रपटा दिया,घमड़ी को।#LSGvsRCB pic.twitter.com/8KcawdGDJU
— Surya Pratap Singh IAS Rtd. (@suryapsingh_IAS) May 1, 2023
Also Read: DC vs GT: గుజరాత్కు షాక్ ఇచ్చిన ఢిల్లీ… లోస్కోరింగ్ మ్యాచ్లో సంచలన విజయం
ప్రత్యేక సాక్షి మాట్లాడుతూ.. విషయం మరింత దిగజారుతుందని గంభీర్ భావించాడు. అందుకే అతను మేయర్స్ను పక్కకు తీసుకెళ్లాడు. అతనితో గొడవ పడకు అన్నాడు గౌతమ్. ఆ తర్వాత విరాట్ ఏదో మాట్లాడడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీని తర్వాత గౌతమ్ విరాట్తో ఏం మాట్లాడుతున్నాడో చెప్పాడు. దీనిపై విరాట్ మాట్లాడుతూ.. నేను నీకు ఏమీ చెప్పలేదు, మధ్యలో ఎందుకు వస్తున్నారని విరాట్ అన్నాడు. నువ్వు నా ఆటగాడిని తిట్టావా అంటే నా కుటుంబాన్ని దూషించినట్టే అని గౌతమ్ అన్నాడు. అలాంటప్పుడు నువ్వు నీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకో అని విరాట్ అన్నాడు. ఇద్దరూ ఒకరికొకరు విడిపోయే ముందు నువ్వు (విరాట్) నాకు నేర్పుతావా అని గౌతమ్ గంభీర్ బదులిచ్చాడు అని ఆయన చెప్పారు.
ఈ విషయంపై కోహ్లీ, గంభీర్, నవీన్లపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు దోషులుగా తేలింది. గంభీర్, కోహ్లీలకు వారి పూర్తి మ్యాచ్ ఫీజు జరిమానా విధించగా, నవీన్-ఉల్-హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు.