Kane Williamson: విరాట్ కోహ్లీ, జో రూట్ రికార్డులను బద్దలుకొట్టిన విలియమ్సన్..!
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) తన కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లోనూ విలియమ్సన్ సెంచరీ సాధించాడు.
- By Gopichand Published Date - 12:01 PM, Tue - 6 February 24
Kane Williamson: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) తన కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లోనూ విలియమ్సన్ సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్లో విలియమ్సన్కి ఇది 31వ సెంచరీ. టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీల విషయంలో విలియమ్సన్ ఇప్పుడు భారత ఆటగాడు విరాట్ కోహ్లీతో పాటు ఇంగ్లండ్కు చెందిన జో రూట్ కంటే ముందున్నాడు. కేన్ విలియమ్సన్ కంటే ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ మాత్రమే ఇప్పుడు ముందున్నాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో సాధించిన సెంచరీ కేన్ విలియమ్సన్ టెస్టు కెరీర్లో 31వ సెంచరీ. ఫాబ్-4లో అత్యధిక సెంచరీలు సాధించిన విలియమ్సన్ ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ 30 సెంచరీలు, భారత ఆటగాడు విరాట్ కోహ్లీ 29 సెంచరీలు సాధించారు. కాగా, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ పేరిట 32 సెంచరీలు ఉన్నాయి.
Also Read: Venu: బలగం వేణు అందులో రెండుసార్లు స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?
అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 31 సెంచరీలు చేసిన మూడో బ్యాట్స్మెన్ విలియమ్సన్
న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్ చరిత్రలో అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 31 సెంచరీలు సాధించిన మూడో బ్యాట్స్మెన్గా నిలిచాడు. విలియమ్సన్ టెస్టు క్రికెట్లో తన 170వ ఇన్నింగ్స్లో 31వ సెంచరీని నమోదు చేశాడు. ఈ రికార్డు జాబితాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్, పాక్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ల తర్వాత విలియమ్సన్ నిలిచాడు. యూనిస్ ఖాన్ 184 ఇన్నింగ్స్ల్లో 31 సెంచరీలు సాధించాడు. పాంటింగ్ 174 ఇన్నింగ్స్ల్లో 31 సెంచరీలు సాధించాడు.
We’re now on WhatsApp : Click to Join
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ రన్స్
ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో కేన్ విలియమ్సన్ 118 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్లో 109 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 511 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 162 పరుగులకే ఆలౌటైంది. దీని తర్వాత వార్తలు రాసే వరకు కివీస్ జట్టు 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఈ పరిస్థితిలో న్యూజిలాండ్ మొత్తం ఆధిక్యం 528 పరుగులుగా మారింది.
Related News
GT vs RCB: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్.. గిల్ జట్టుకు డూ ఆర్ డై మ్యాచ్..!
IPL 2024 సీజన్ ఇప్పుడు ట్రేడింగ్ సీజన్గా మారింది. ఈ సీజన్లో పరుగుల పరంగా ఎన్నో రికార్డులు బద్దలవుతున్నాయి. లీగ్ 17వ సీజన్లో దాదాపు ప్రతి మ్యాచ్లో 200 స్కోర్లు చేస్తున్నారు.