World Cup 2023: ప్రపంచ కప్ టోర్నీలో జో రూట్ విధ్వంసం
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ విధ్వంసక సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్లో 6వ సెంచరీని నమోదు చేశాడు.
- By Praveen Aluthuru Published Date - 09:18 PM, Tue - 10 October 23
World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ విధ్వంసక సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్లో 6వ సెంచరీని నమోదు చేశాడు. 107 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 140 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో జో రూట్ 68 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 82 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్ మ్యాచ్ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా అరుదైన గౌరవం అందుకున్నాడు. ఈ క్రమంలో గ్రాహం గూచ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
ప్రపంచ కప్ టోర్నీలలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 క్రికెటర్లు
1. జో రూట్- 898
2. గ్రాహం గూచ్- 897
3. ఇయాన్ బెల్- 718
4. అలాన్ లాంబ్- 656
5. గ్రేమ్ హిక్- 635
Also Read: Pawan Kalyan Health : వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్
Related News
Hybrid Pitch: భారతదేశపు మొదటి హైబ్రిడ్ పిచ్ సిద్ధం
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ధర్మశాలలో భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ పిచ్ను ఏర్పాటు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్, మాజీ ఇంగ్లండ్ అంతర్జాతీయ క్రికెటర్ మరియు ఎస్ఐఎస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పాల్ టేలర్ మరియు హెచ్పిసిఎ అధికారుల సమక్షంలో ఎస్ఐఎస్ గ్రాస్ హైబ్రిడ్ పిచ్ను ఆవిష్కరించారు.