IPL 2025: ‘క్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్’.. ఎలా పట్టారో చూడండి, వీడియో వైరల్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర క్యాచ్ పట్టారు.
- By Gopichand Published Date - 08:04 AM, Wed - 2 April 25

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో (IPL 2025) లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర క్యాచ్ పట్టారు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 171 పరుగులు చేసింది. ఈ సమయంలో పంజాబ్ బ్యాట్స్మెన్లు దూకుడైన ఆరంభాన్ని అందించారు. జట్టు యువ బ్యాట్స్మన్ ప్రభసిమ్రన్ సింగ్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు.
‘క్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్’
లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో రవి బిష్ణోయ్ టోర్నమెంట్లోనే అత్యుత్తమ క్యాచ్ను అందుకున్నాడు. నిజానికి దిగ్విజయ్ రాఠీ వేసిన బాల్ను ప్రభసిమ్రన్ సింగ్ ఆఫ్ సైడ్ వైపు అద్భుతమైన షాట్ ఆడాడు. ఈ సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆయుష్ బదోనీ గాలిలోకి ఎగిరి ఆ షాట్ను అడ్డుకున్నాడు. కానీ క్యాచ్ పట్టలేకపోయాడు. అయితే, అతని పక్కనే ఉన్న రవి బిష్ణోయ్ గాలిలోకి ఎగిరి ఆ క్యాచ్ను అద్భుతంగా పట్టుకున్నాడు. అతని ఈ క్యాచ్ను చూసి అభిమానులు అందరూ ఆశ్చర్యపోయారు. ‘క్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్’ అంటూ కామెంట్స్ పెట్టారు.
లక్నో సూపర్ జెయింట్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది
నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీల అద్భుత ఇన్నింగ్స్ల సహాయంతో లక్నో సూపర్ జెయింట్స్ మంగళవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ కింగ్స్పై చెడు ఆరంభం నుంచి కోలుకుని 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. పూరన్ 44, బదోనీ 41 పరుగులు చేశారు.
WHAT A CRAZY CATCH BY BADONI & BISHNOI 💪🔥 pic.twitter.com/7t2TCGvNsJ
— Johns. (@CricCrazyJohns) April 1, 2025
బదోనీ, అబ్దుల్ సమద్ (27)తో కలిసి ఆరవ వికెట్కు కేవలం 21 బంతుల్లో 47 పరుగులు జోడించి, జట్టు స్కోరును 170 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ కింగ్స్ తరపున అర్ష్దీప్ సింగ్ అత్యంత విజయవంతమైన బౌలర్గా నిలిచాడు. అతను 43 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
Also Read: Waqf Board Bill : వక్ఫ్ బిల్లు కు అధికారికంగా మద్దతు ప్రకటించిన టీడీపీ
IPL 2025లో భాగంగా జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. జట్టు తరపున నికోలస్ పూరన్ అత్యధికంగా 44 పరుగులు సాధించాడు. 172 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 16.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. ప్రభసిమ్రన్ సింగ్ బ్యాట్ బాగా రాణించింది. అతను 34 బంతుల్లో 69 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 30 బంతుల్లో అజేయంగా 52 పరుగులు సాధించాడు. ఈ విజయంతో పంజాబ్కు పాయింట్స్ టేబుల్లో కూడా ప్రయోజనం చేకూరింది.