Olympic Medal: 36 ఏళ్ల కల తీరుస్తారా..? ఈ సారైనా ఆర్చరీలో స్వర్ణం వస్తుందా..?
జులై 25న జరిగే పారిస్ ఒలింపిక్స్లో భారత ఆర్చర్లు కనిపించనున్నారు. ఈసారి దేశం నుండి 6 మంది ఆర్చర్ అథ్లెట్లు ఒలింపిక్ క్రీడలకు (Olympic Medal) అర్హత సాధించారు.
- By Gopichand Published Date - 07:00 AM, Thu - 25 July 24
Olympic Medal: జులై 25న జరిగే పారిస్ ఒలింపిక్స్లో భారత ఆర్చర్లు కనిపించనున్నారు. ఈసారి దేశం నుండి 6 మంది ఆర్చర్ అథ్లెట్లు ఒలింపిక్ క్రీడలకు (Olympic Medal) అర్హత సాధించారు. ఇందులో దీపికా కుమారి, అంకితా భగత్, తరుణ్దీప్ రాయ్ ఉన్నారు. ఈ అథ్లెట్లందరూ సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో పతకాలు గెలుస్తారని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ క్రీడలో భారతదేశ చరిత్ర మెరుపడాల్సి ఉంది. చరిత్రలో భారత అథ్లెట్లు ఆర్చరీలో ఏ పతకాన్ని సాధించలేకపోయిన పరిస్థితి ఉంది.
ఆర్చరీని 1900లో ఒలింపిక్ క్రీడల్లో చేర్చారు. అయితే 1988 ఒలింపిక్స్లో తొలిసారిగా భారతీయ అథ్లెట్లు ఈ క్రీడలో కనిపించారు. ఆ తర్వాత భారత ఆర్చర్లు ప్రతిసారీ ఒలింపిక్స్లో పాల్గొంటున్నా.. పతకం సాధించేందుకు నిరీక్షణ తప్పటం లేదు. ఇప్పుడు 2024లో క్రీడాకారులు మరోసారి కొత్త ఆశలు, అంకితభావంతో పతకాల బాట పట్టారు. విలువిద్య పోటీలు జూలై 25న ప్రారంభమవుతాయి. అన్ని పోటీలు, సింగిల్స్, డబుల్స్ ఆగస్టు 4 నాటికి ముగుస్తాయి.
Also Read: Bigg Boss 8 : బిగ్ బాస్ కోసం కింగ్ సైజ్ రెమ్యునరేషన్..!
ఎప్పుడూ సెమీ ఫైనల్స్కు చేరుకోలేదు
విలువిద్యలో భారతదేశ చరిత్ర చెప్పుకోదగిన విధంగా లేదు. ఈ క్రీడలో దేశంలోని అథ్లెట్లు ఎప్పుడూ సెమీ-ఫైనల్కు చేరుకోలేదు. ఒంటరిగా ఫైనల్స్ ఆడలేదు. 2008 బీజింగ్ ఒలింపిక్స్, 2016 రియో ఒలింపిక్స్లో కూడా మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. 2020 టోక్యో ఒలింపిక్స్లో పురుషుల జట్టు మిక్స్డ్ టీమ్, మహిళల సింగిల్స్ ఈవెంట్లలో దీపికా కుమారి భారతదేశం తరపున క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు. అంతేకాకుండా భారత్ నుంచి ఇప్పటి వరకు ఏ ఆర్చర్ కూడా సింగిల్స్ విభాగంలో ఒలింపిక్ క్రీడల్లో క్వార్టర్ ఫైనల్కు చేరుకోలేదు.
We’re now on WhatsApp. Click to Join.
ఎవరిపై ఆశలు..?
మహిళల గురించి మాట్లాడుకుంటే.. భారతదేశం విలువిద్య బృందంలో దీపికా కుమారి, అంకితా భగత్, భజన్ కౌర్ ఉన్నారు. ఈ ముగ్గురు అథ్లెట్లు సింగిల్స్, డబుల్స్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. మరోవైపు పురుష ఆటగాళ్లలో తరుణ్దీప్ రాయ్, ధీరజ్ బొమ్మదేవర, ప్రవీణ్ జాదవ్లకు చోటు దక్కింది. ఈ ముగ్గురు అథ్లెట్లు పురుషుల సింగిల్స్, డబుల్స్ పోటీలలో కూడా పాల్గొంటారు. అంతేకాకుండా ఈ ఆటగాళ్ళు తమలో తాము జట్లను ఏర్పరుచుకుని మిక్స్డ్ పోటీలో కూడా పాల్గొంటారు.
Related News
Vinesh Phogat: వినేష్ ఫోగట్ అప్పీల్ను సీఏఎస్ రిజెక్ట్ చేయడానికి కారణమిదే..?
CAS తన వివరణాత్మక ఆర్డర్లో వినేష్ స్వచ్ఛందంగా ఈ బరువు విభాగంలో పాల్గొన్నారు. ఆమెకు ఇప్పటికే అన్ని నియమాలు, షరతులు తెలుసు. ఆమె బరువు పెరగడం ఆమె స్వంత తప్పిదం వల్ల జరిగింది.