IND vs SL: లంకపై జోరు కొనసాగేనా?
ఆసియా కప్ లో భాగంగా టీమిండియా ఏ రోజు శ్రీలంకతో ఆడనుంచి. అంతకుముందు భారత్ పాకి పై భారీ తేడాతో నెగ్గింది. సూపర్-4 మ్యాచ్ లో టీమిండియా పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్ లో బ్యాటర్లు సత్తా చాటితే బౌలర్లు పాక్ ఆటగాళ్లను వణికించేసిశారు.
- By Praveen Aluthuru Published Date - 02:23 PM, Tue - 12 September 23
IND vs SL: ఆసియా కప్ లో భాగంగా టీమిండియా శ్రీలంక మధ్య రసవత్తర పోరు మొదలైంది. అంతకుముందు భారత్ పాకి పై భారీ తేడాతో నెగ్గింది. సూపర్-4 మ్యాచ్ లో టీమిండియా పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్ లో బ్యాటర్లు సత్తా చాటితే బౌలర్లు పాక్ ఆటగాళ్లను వణికించేసిశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ , శుభ్ మన్ గిల్ చెరో హాఫ్ సెంచరీతో శుభారంభం ఇవ్వగా.. ఆ తర్వాత వచ్చిన పరుగుల యంత్రం కింగ్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చెరో సూపర్ సెంచరీతో పాక్ ఆటగాళ్ల పతనాన్ని శాసించారు. ఇన్నింగ్స్ లో కుల్దీప్ యాదవ్ అద్భుతంగ బౌల్ చేసి 5 వికెట్లు తీసుకున్నాడు.
టీమిండియా మూడు రోజులుగా రెస్ట్ లెస్ గా ఆడుతుంది. మొదటి రోజు పాక్ తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడగా నిన్న సోమవారం అదే మ్యాచ్ కంటిన్యూ అయింది. ఇక ఈ రోజు వరుసగా మూడో రోజు మరోసారి బరిలోకి దిగనుంది. కొలంబో వేదికగా జరుగనున్న సూపర్-4 మ్యాచ్లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆటగాళ్లపైనే అందరి దృష్టి. ఇక ఓపెనర్లు రోహిత్ గిల్ కూడా మంచి ఫామ్ లో కనిపించారు. అటు బౌలింగ్ ఫార్మేట్ అద్భుతంగా ఉంది. బుమ్రా, పాండ్యా , కుల్దీప్, ఠాకూర్ రాణిస్తున్నారు. పాక్ పైన భారీ విజయాన్ని అందుకున్న ఆటగాళ్లు అదే జోరుని లంకపై కొనసాగించాలని ఉవిళ్లూరుతున్నారు.
Also Read: Video Viral: ర్యాంప్ వాక్ చేస్తుండగా ఈడ్చిపడేసిన సెక్యూరిటీ.. వీడియో వైరల్?
Related News
T20 World Cup: ప్రపంచకప్ గెలిపించే మొనగాడు అతడే
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచినప్పటికీ ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 11 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీశాడు. ప్రస్తుతం బుమ్రా పర్పుల్ క్యాప్ కలిగి ఉన్నాడు. కాగా జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్లో బుమ్రానే భారత జట్టులో కీలక ఆటగాడిగా పలువురు అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.