Pre-Match Ceremony: టీవీల్లో ప్రసారం కానీ భారత్, పాకిస్థాన్ ప్రీమ్యాచ్ సెర్మనీ.. కారణమిదే..?
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్కు ముందు స్టేడియంలో మ్యూజికల్ ఈవెంట్ (Pre-Match Ceremony) కూడా ఏర్పాటు చేశారు.
- By Gopichand Published Date - 02:35 PM, Sat - 14 October 23
Pre-Match Ceremony: ప్రపంచ కప్ 2023లో అతిపెద్ద మ్యాచ్ ప్రారంభమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్కు ముందు స్టేడియంలో మ్యూజికల్ ఈవెంట్ (Pre-Match Ceremony) కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ స్టేడియంలో ఉన్న క్రికెట్ అభిమానుల కోసం మాత్రమే ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అందుకే ఈ ఈవెంట్ టీవీల్లో టెలికాస్ట్ చేయలేదు. శంకర్ మహదేవన్ పాటలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
స్టేడియంలో ఉన్న 1.25 లక్షల మందికి పైగా క్రికెట్ అభిమానుల సమక్షంలో శంకర్ మహదేవన్ ‘సునో గౌర్ సే దునియా వాలో’ పాటను పాడారు. అతను తన ప్రసిద్ధ పాట ‘బ్రీత్లెస్’ పాడి స్టేడియంలోని అభిమానులను అలరించాడు. శంకర్ మహదేవన్ తర్వాత సునిధి చౌహాన్ రంగప్రవేశం చేసింది. నిర్భయ గాన శైలితో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఆ తర్వాత అరిజిత్ సింగ్ వేదికపైకి రాగానే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు సందడి చేసి స్వాగతం పలికారు.
This is emotion for us 🇮🇳
Vande Matram ❤️#INDvsPAK #ArijitSingh pic.twitter.com/A11GfQlXqR— Satyam Rajput (@Rajputboy8360) October 14, 2023
We’re now on WhatsApp. Click to Join.
ఈ సంగీత కార్యక్రమంలో సుఖ్వీందర్ సింగ్ కూడా తన ఉద్వేగభరితమైన పాటలను పాడారు. వీటిలో చక్ దే ఇండియా, జై హో పాటలు ఉన్నాయి. చివర్లో నలుగురు గాయకులు కలిసి వందేమాతరం పాడారు. సంగీత కార్యక్రమం ప్రారంభానికి ముందు నుంచే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వాతావరణం నెలకొంది. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో స్టేడియానికి సంబంధించిన ప్రతి అప్డేట్ను సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూనే ఉన్నారు.
Sultan Title Track Playing At Ahmedabad Stadium During #INDvsPAK Match. The Reach Of Megastar #SalmanKhan Songs 🔥🔥 #Tiger3pic.twitter.com/fKumlkVwVp
— DeviL PaSha 🚬 (@iBeingAli_Pasha) October 14, 2023
Also Read: India vs Pakistan: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టు ఇదే..!
టాస్ గెలిచిన టీమిండియా
2023 ప్రపంచకప్ కోసం భారత్, పాకిస్థాన్ల (India vs Pakistan) మధ్య పోరు మొదలైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియా ప్లేయింగ్-11లో ఒకే ఒక్క మార్పు చోటు చేసుకుంది. ఇషాన్ కిషన్ స్థానంలో శుభ్మన్ గిల్ జట్టులోకి తిరిగి వచ్చాడు. మరోవైపు పాక్ జట్టులో ఎలాంటి మార్పు లేదు.
టీమిండియా జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్ జట్టు: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, హరీస్ రవూఫ్.
Related News
Elon Musk: భారత పర్యటన రద్దు చేసుకుని చైనా వెళ్లిపోయిన ఎలాన్ మస్క్
ఎలోన్ మస్క్ తన భారత పర్యటనను రద్దు చేసుకుని చైనా వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ పర్యటన పబ్లిక్ గా జరగలేదు. ఓ ప్రైవేట్ జెట్ ద్వారా ఎలాన్ మస్క్ చైనా వెళ్లినట్లు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం మస్క్ చైనా పర్యటనలో భాగంగా చైనా అధికారులతో రహస్య భేటీలు నిర్వహించారు.