India vs Pakistan: ప్రపంచకప్లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్ కు కొత్త తేదీ ఫిక్స్.. కారణమిదే..!?
2023 వన్డే ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) మధ్య మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న జరగనుంది. అయితే ఈ మ్యాచ్ తేదీ మారనుంది.
- By Gopichand Published Date - 06:49 AM, Tue - 1 August 23
India vs Pakistan: 2023 వన్డే ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) మధ్య మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న జరగనుంది. అయితే ఈ మ్యాచ్ తేదీ మారనుంది. ఓ నివేదిక ప్రకార.. నేడు ఇండో-పాక్ మ్యాచ్ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. అయితే, దీనికి ముందు ఇండో-పాక్ మ్యాచ్ తేదీ నివేదికలో ప్రస్తావనకు వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం.. 2023 ODI ప్రపంచ కప్లో ఇండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఇప్పుడు అక్టోబర్ 15కి బదులుగా అక్టోబర్ 14న జరగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు బిసిసిఐ లేదా ఐసిసి.. ఇండో-పాక్ మ్యాచ్ కొత్త తేదీని ప్రకటించలేదు. ప్రపంచ కప్ షెడ్యూల్లో మరిన్ని మార్పులు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మార్పులకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
భారత్-పాక్ మ్యాచ్ తేదీ మార్పుకి కారణమిదే..?
నివేదిక ప్రకారం.. నవరాత్రి అక్టోబర్ 15న వస్తుంది. ఈ కారణంగానే వన్డే ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ తేదీ మారనుంది. ఇప్పుడు మ్యాచ్ అక్టోబర్ 15కి బదులుగా అక్టోబర్ 14న జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), BCCI గత నెలలో ప్రపంచ కప్ షెడ్యూల్ను ప్రకటించాయి. అహ్మదాబాద్లోని ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియంలో ఇండో- పాక్ మ్యాచ్ను నిర్వహించనుంది.
Also Read: WI vs IND: బాబర్ అజామ్ రికార్డును బద్దలు కొట్టిన గిల్
ప్రపంచకప్లో భాగంగా అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అక్టోబర్ 6, 12 తేదీల్లో హైదరాబాద్లో పాకిస్థాన్ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. ఒకరోజు ముందుగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగడం వల్ల బాబర్ అజామ్ జట్టుకు ప్రాక్టీస్కు ఒక రోజు తక్కువ సమయం లభిస్తుంది. ఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై, పూణే, బెంగళూరు, లక్నో, చెన్నై, కోల్కతాతో సహా భారతదేశంలోని 10 నగరాల్లో అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు 2023 ODI ప్రపంచ కప్ జరగనుంది.
భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ను చూసేందుకు అహ్మదాబాద్కు విమానాలు, హోటళ్ల బుకింగ్తో సహా ఇప్పటికే ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్న అభిమానులు, వాటాదారులలో ఈ షెడ్యూల్ మార్పు ప్రకటన ఆందోళన కలిగిస్తుంది. ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చూసే మ్యాచ్ లలో ఒకటి. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Related News
Pak : భారత్ చంద్రుడిపై కాలుపమోపింది..మరి మనం..పాక్ చట్ట సభ్యుడి కీలక వ్యాఖ్యలు
Pakistan: భారత్(India) సాధిస్తున్న విజయాలు..పాకిస్థాన్(Pakistan) దయనీయ స్థితిని వివరిస్తూ.. ఆదేశ చట్టసభ సభుడు చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్గా మారింది. భారత్ చంద్రుడి మీద కాలుమోపింది..మరి పాకిస్థాన్లో పిల్లలు మాత్రం కాల్వల్లో కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారని పాక్ చట్ట సభ్యుడు, ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్థాన్ (ఎంక్యూఎం-పీ) పార్టీ నేత సయ్యద్ ముస్తాఫా కమల్ కీలక వ్యాఖ్యలు చే�