Chris Gayle: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ పై క్రిస్ గేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే..?
అక్టోబర్ 15న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య గ్రేట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు ఈ మ్యాచ్కు సంబంధించి వెస్టిండీస్ వెటరన్ క్రిస్ గేల్ (Chris Gayle) ఓ ప్రకటన చేశాడు.
- Author : Gopichand
Date : 01-07-2023 - 7:15 IST
Published By : Hashtagu Telugu Desk
Chris Gayle: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారత్లో జరగనున్న వన్డే వరల్డ్ షెడ్యూల్ను ప్రకటించడంతో అభిమానులంతా ఇప్పుడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. దీని తర్వాత అక్టోబర్ 15న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య గ్రేట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు ఈ మ్యాచ్కు సంబంధించి వెస్టిండీస్ వెటరన్ క్రిస్ గేల్ (Chris Gayle) ఓ ప్రకటన చేశాడు.
ప్రపంచంలో ఏ మూలన భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగినా.. దాని థ్రిల్ చూడ్డానికి ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని యాషెస్ సిరీస్ కంటే భారత్, పాక్ మధ్య పోటీ చాలా పెద్దదని క్రిస్ గేల్ అన్నాడు. గేల్ మాట్లాడుతూ.. ఇరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ని ప్రపంచ క్రికెట్ అభిమానులు కళ్లారా చూస్తున్నారు. యాషెస్ సిరీస్ కంటే భారత్-పాకిస్థాన్ మధ్య పోటీ చాలా పెద్దదని టైమ్స్ ఆఫ్ ఇండియాతో జరిగిన సంభాషణలో క్రిస్ గేల్ చెప్పాడు. మీరు దీనిని అంచనా వేయలేరు. ప్రపంచంలోని బిలియన్ల మంది ప్రజలు ఈ మ్యాచ్పై ఇప్పటికే చాలా ఆసక్తిగా ఉన్నారు. దీనిని చూస్తారు. అక్టోబరు 15న ఏం జరగబోతోందో అని నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని గేల్ పేర్కొన్నాడు.
Also Read: Rajamouli: క్రీడారంగంలోకి జక్కన్న.. ISBC చైర్మన్ గా రాజమౌళి
అహ్మదాబాద్లో హోటళ్ల ధరలు విపరీతంగా పెరిగాయి
2023 వన్డే ప్రపంచకప్లో అతిపెద్ద మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్లో ఇప్పటి నుంచే గదుల బుకింగ్తో హోటళ్ల ధరలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే వన్డే ప్రపంచకప్లో భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. దీని తర్వాత అక్టోబరు 11న అఫ్గానిస్థాన్తో రెండో మ్యాచ్, ఆ తర్వాత పాకిస్థాన్తో మూడో మ్యాచ్ ఆడనుంది. ఈసారి వన్డే ప్రపంచకప్లో 10 జట్లు పాల్గొంటుండగా రౌండ్ రాబిన్ ఫార్మాట్లో మ్యాచ్లు జరగనున్నాయి.