HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >India Vs Pakistan Final On Cards

T20 World Cup: మెల్‌బోర్న్ పిలుస్తోంది.. మళ్ళీ దాయాదుల సమరం..?

చిరకాల ప్రత్యర్థులు ఏ ఫార్మాట్‌లో ఎప్పుడు ఎక్కడ తలపడినా ఆ కిక్కే వేరు..

  • By Naresh Kumar Published Date - 09:47 PM, Wed - 9 November 22
  • daily-hunt
Champions Trophy 2025
Champions Trophy 2025

చిరకాల ప్రత్యర్థులు ఏ ఫార్మాట్‌లో ఎప్పుడు ఎక్కడ తలపడినా ఆ కిక్కే వేరు.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రెండు జట్లూ ఆరంభ మ్యాచ్‌లో తలపడితే..ఈ పోరు ఎప్పటిలానే ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఇప్పుడు మరోసారి భారత్,పాక్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశం కనిపిస్తోంది.. అది కూడా వరల్డ్ ఛాంపియన్‌ను తేల్చే ఫైనల్‌..మరి ఫ్యాన్స్‌ ఆశలు నెరవేరతాయా ? టీ ట్వంటీ అంటేనే క్రికెట్ ఫ్యాన్స్‌కు మజా.. ఇలాంటి ఫార్మేట్‌లో ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాక్ తలపడితే.. అది కూడా టైటిల్ కోసం ఢీకొడితే ఫ్యాన్స్‌కు పండగే..కేవలం రెండు దేశాల అభిమానులే కాదు మొత్తం క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ మ్యాచ్‌ విందు భోజనం లాంటిదే.

ఈ సారి టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో ఒకసారి ఇలాంటి కిక్కును ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్‌కు ఇప్పుడు మరోసారి దాయాదుల సమరాన్ని వీక్షించే అవకాశం ఊరిస్తోంది. అదృష్టవశాత్తూ సెమీస్ చేరిన పాకిస్తాన్ న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకోగా.. ఇప్పుడు రెండో సెమీస్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడబోతున్నాయి. టీమిండియా, ఇంగ్లీష్ టీమ్‌ను నిలువరిస్తే ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు టైటిల్ కోసం పోటీ పడతాయి. అంటే 15 ఏళ్ళ తర్వాత ప్రపంచకప్ ఫైనల్లో భారత్, పాక్‌ తలపడే అవకాశం అభిమానులను ఊరిస్తోంది.

2007 తొలి టీ ట్వంటీ వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్, పాక్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఆ పోరులో ధోనీ సారథ్యంలోని టీమిండియా పాక్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఇప్పుడు మరోసారి అలాంటి అవకాశం ఊరిస్తున్న వేళ రోహిత్‌సేన ఇంగ్లాండ్‌ను సెమీస్‌లో నిలువరించి పాక్‌తో ఫైనల్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాక్‌పై సూపర్ విక్టరీ అందుకున్న టీమిండియా ఫైనల్‌కు చేరితే మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పాక్ అభిమానులు మాత్రం భారత్‌ ఫైనల్‌కు రాకూడదని కోరుకుంటున్నారు. ఎందుకంటే మెగా టోర్నీల్లో టీమిండియాపై పాక్‌ పేలవ రికార్డు వారిని భయపెడుతోంది. భారత్‌తో మ్యాచ్ అంటే ఒత్తిడికి లోనయ్యే తమ ఆటగాళ్ళు ఫైనల్లో అసలు దానిని అధిగమించలేరని బలంగా నమ్ముతున్నారు. అందుకే రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్ గెలవాలని పాక్ ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. అయితే యావత్ క్రికెట్ ప్రపంచం మాత్రం భారత్‌ ఫైనల్‌కు చేరి పాక్‌పై మళ్ళీ గెలవడం ద్వారా రెండోసారి టీ ట్వంటీ వరల్డ్‌కప్ కైవసం చేసుకోవాలని ఆకాంక్షిస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ICC T20 world cup
  • ICC T20 World Cup 2022
  • India vs Pakistan
  • pakistan
  • T20 World Cup finals
  • TeamIndia

Related News

Upendra Dwivedi

Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

Operation Sindoor : భారత-పాక్‌ మధ్య యుద్ధాలు అధికారికంగా ముగిసినా, పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఆగలేదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టంచేశారు.

  • Hardik Pandya

    Hardik Pandya: ఆసియా క‌ప్‌కు ముందు స‌రికొత్త లుక్‌లో హార్దిక్ పాండ్యా!

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

  • Attack In Balochistan

    Pakistan : బెలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి – 25 మంది మృతి

  • A massive earthquake shook Afghanistan, killing more than 250 people

    Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి

Latest News

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

  • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd