HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Vs Pakistan Final On Cards

T20 World Cup: మెల్‌బోర్న్ పిలుస్తోంది.. మళ్ళీ దాయాదుల సమరం..?

చిరకాల ప్రత్యర్థులు ఏ ఫార్మాట్‌లో ఎప్పుడు ఎక్కడ తలపడినా ఆ కిక్కే వేరు..

  • Author : Naresh Kumar Date : 09-11-2022 - 9:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Champions Trophy 2025
Champions Trophy 2025

చిరకాల ప్రత్యర్థులు ఏ ఫార్మాట్‌లో ఎప్పుడు ఎక్కడ తలపడినా ఆ కిక్కే వేరు.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రెండు జట్లూ ఆరంభ మ్యాచ్‌లో తలపడితే..ఈ పోరు ఎప్పటిలానే ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఇప్పుడు మరోసారి భారత్,పాక్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశం కనిపిస్తోంది.. అది కూడా వరల్డ్ ఛాంపియన్‌ను తేల్చే ఫైనల్‌..మరి ఫ్యాన్స్‌ ఆశలు నెరవేరతాయా ? టీ ట్వంటీ అంటేనే క్రికెట్ ఫ్యాన్స్‌కు మజా.. ఇలాంటి ఫార్మేట్‌లో ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాక్ తలపడితే.. అది కూడా టైటిల్ కోసం ఢీకొడితే ఫ్యాన్స్‌కు పండగే..కేవలం రెండు దేశాల అభిమానులే కాదు మొత్తం క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ మ్యాచ్‌ విందు భోజనం లాంటిదే.

ఈ సారి టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో ఒకసారి ఇలాంటి కిక్కును ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్‌కు ఇప్పుడు మరోసారి దాయాదుల సమరాన్ని వీక్షించే అవకాశం ఊరిస్తోంది. అదృష్టవశాత్తూ సెమీస్ చేరిన పాకిస్తాన్ న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకోగా.. ఇప్పుడు రెండో సెమీస్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడబోతున్నాయి. టీమిండియా, ఇంగ్లీష్ టీమ్‌ను నిలువరిస్తే ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు టైటిల్ కోసం పోటీ పడతాయి. అంటే 15 ఏళ్ళ తర్వాత ప్రపంచకప్ ఫైనల్లో భారత్, పాక్‌ తలపడే అవకాశం అభిమానులను ఊరిస్తోంది.

2007 తొలి టీ ట్వంటీ వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్, పాక్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఆ పోరులో ధోనీ సారథ్యంలోని టీమిండియా పాక్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఇప్పుడు మరోసారి అలాంటి అవకాశం ఊరిస్తున్న వేళ రోహిత్‌సేన ఇంగ్లాండ్‌ను సెమీస్‌లో నిలువరించి పాక్‌తో ఫైనల్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాక్‌పై సూపర్ విక్టరీ అందుకున్న టీమిండియా ఫైనల్‌కు చేరితే మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పాక్ అభిమానులు మాత్రం భారత్‌ ఫైనల్‌కు రాకూడదని కోరుకుంటున్నారు. ఎందుకంటే మెగా టోర్నీల్లో టీమిండియాపై పాక్‌ పేలవ రికార్డు వారిని భయపెడుతోంది. భారత్‌తో మ్యాచ్ అంటే ఒత్తిడికి లోనయ్యే తమ ఆటగాళ్ళు ఫైనల్లో అసలు దానిని అధిగమించలేరని బలంగా నమ్ముతున్నారు. అందుకే రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్ గెలవాలని పాక్ ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. అయితే యావత్ క్రికెట్ ప్రపంచం మాత్రం భారత్‌ ఫైనల్‌కు చేరి పాక్‌పై మళ్ళీ గెలవడం ద్వారా రెండోసారి టీ ట్వంటీ వరల్డ్‌కప్ కైవసం చేసుకోవాలని ఆకాంక్షిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ICC T20 world cup
  • ICC T20 World Cup 2022
  • India vs Pakistan
  • pakistan
  • T20 World Cup finals
  • TeamIndia

Related News

Suryakumar Yadav

సిరీస్ గెలిచినా.. ఓ పెద్ద లోటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలనం

భారత్ – దక్షిణాఫ్రికా టీ 20 సిరీస్‌ను టీమిండియా గెలిచినా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశాడు. 2025లో ఒక్క అర్ధశతకం కూడా చేయని సూర్య, తన ఫామ్ కోల్పోవడంపై నిజాయితీగా స్పందించాడు. ఐపీఎల్‌లో అదరగొట్టినా, అంతర్జాతీయాల్లో అదే జోరు చూపలేకపోతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లోనైనా ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 న

  • Pakistan extends ban on Indian flights

    భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్

  • Shashi Tharoor

    లక్నో మ్యాచ్ రద్దు పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం

  • Pakistan

    పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు.. కోచ్‌ను తొల‌గించిన పీసీబీ!

  • Adiala Jail

    పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

Latest News

  • వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్‌ గిల్‌ ఔట్?

  • మంత్రి లోకేశ్ వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో భయం మొదలైంది

  • సర్పంచ్ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ అసంతృప్తి

  • ఆ 10 డెంటల్ కళాశాలలపై రూ.100 కోట్ల జరిమానా? సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

  • బీజేపీలో చేరనున్న టాలీవుడ్ సీనియర్ నటి

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd