టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్!
భారత్ తరఫున సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు.
- Author : Gopichand
Date : 08-03-2026 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
India vs New Zealand: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్పై టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరు కావడం విశేషం.
Also Read: NTR : ఎన్టీఆర్ చెప్పిన సమాధానంతో అంత షాక్
భారత్ తరఫున సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇషాన్ కిషన్ కూడా మెరుపులు మెరిపిస్తూ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు సాధించాడు. ఇక ఈ టోర్నమెంట్ అంతటా ఫామ్ కోసం ఇబ్బంది పడ్డ అభిషేక్ శర్మ ఫైనల్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు రాబట్టాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకోవడం, మొదటి ఇన్నింగ్స్ ముగిసేసరికి వారు చేసిన అతిపెద్ద తప్పుగా కనిపిస్తోంది. ఫైనల్ వంటి కీలక మ్యాచ్లో 250కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అస్సలు సులభం కాదు.
భారత్కు అదిరిపోయే ఆరంభం
తొలుత బ్యాటింగ్కు దిగిన టీమ్ ఇండియాకు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ జోడీ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. వీరిద్దరూ మొదటి వికెట్కు కేవలం 43 బంతుల్లోనే 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత భారత బ్యాటర్లు వెనక్కి తిరిగి చూడలేదు. జట్టు స్కోరు 203 పరుగుల వద్ద ఉన్నప్పుడు సంజూ రూపంలో భారత్కు రెండో వికెట్ పడింది. సంజూ మరియు ఇషాన్ కిషన్ కలిసి రెండో వికెట్కు 48 బంతుల్లో 105 పరుగులు జోడించారు.
చివర్లో పరుగుల వేగం కాస్త తగ్గింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఖాతా తెరవకుండానే అవుట్ అవ్వగా, హార్దిక్ పాండ్యా కూడా 13 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే చివర్లో శివమ్ దూబే మెరుపులు మెరిపించాడు. కేవలం 8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసి జట్టు స్కోరును భారీ స్థాయికి చేర్చాడు.
కివీస్ బౌలర్లకు చుక్కలు
భారత బ్యాటర్ల ధాటికి న్యూజిలాండ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
లాకీ ఫెర్గూసన్: 2 ఓవర్లలో ఏకంగా 48 పరుగులు ఇచ్చి అత్యంత ఖరీదైన బౌలర్గా నిలిచాడు.
రచిన్ రవీంద్ర: 2 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు.
జాకబ్ డఫీ: 3 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చాడు.
జేమ్స్ నీషమ్: 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
కెప్టెన్ మిచెల్ సాంట్నర్: 3 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చాడు.