India vs England: భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు మూడో టెస్టు.. రిక్డారు సృష్టించనున్న అశ్విన్, స్టోక్స్..!
భారత్-ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య గురువారం నుంచి మూడో టెస్టు సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్ రాజ్కోట్లో జరగనుంది.
- By Gopichand Published Date - 08:53 AM, Thu - 15 February 24
India vs England: భారత్-ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య గురువారం నుంచి మూడో టెస్టు సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్ రాజ్కోట్లో జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్లో ఒక మార్పు చేసింది. షోయబ్ బషీర్ స్థానంలో మార్క్ వుడ్కు అవకాశం ఇచ్చారు. రవిచంద్రన్ అశ్విన్, బెన్స్టోక్స్లకు ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం. ఈ ఇద్దరు ఆటగాళ్లు టెస్టుల్లో రికార్డు సృష్టించేందుకు చేరువలో ఉన్నారు. ప్లేయింగ్ ఎలెవన్లో సర్ఫరాజ్ ఖాన్కు టీమ్ ఇండియా చోటు కల్పించవచ్చు.
గ్యారీ సోబర్స్, జాక్వెస్ కలిస్ల జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చేరిపోయాడు. స్టోక్స్ టెస్ట్ క్రికెట్లో 6000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అంతేకాకుండా 200 టెస్ట్ వికెట్లు పూర్తి చేయడానికి దగ్గరగా ఉన్నాడు. స్టోక్స్ 179 ఇన్నింగ్స్లలో 6251 పరుగులు చేశాడు. దీంతో పాటు 197 వికెట్లు కూడా తీశారు. 200 వికెట్లు పూర్తి చేయడానికి అతనికి మూడు వికెట్లు కావాలి. టెస్టు క్రికెట్లో స్టోక్స్ అత్యుత్తమ స్కోరు 258 పరుగులు. రాజ్కోట్ టెస్టులో అతడు చరిత్ర సృష్టించే అవకాశముంది.
Also Read: IPL Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత్లోనా..? విదేశాల్లోనా..? మే 26న ఫైనల్ మ్యాచ్..?
టీమిండియా బెస్ట్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఓ ప్రత్యేక రికార్డుకు చేరువలో ఉన్నాడు. టెస్టుల్లో 500 వికెట్లు పూర్తి చేసి రికార్డు సృష్టించేందుకు ఒక వికెట్ దూరంలో ఉన్నాడు. అశ్విన్ 97 మ్యాచుల్లో 499 వికెట్లు తీశాడు. దీంతో పాటు 3271 పరుగులు కూడా చేశాడు. అశ్విన్ అత్యుత్తమ టెస్టు స్కోరు 124 పరుగులు. ఈ ఫార్మాట్లో 5 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. రాజ్కోట్లో జరిగే టెస్టు కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్లో మార్పులు చేయవచ్చు. ప్లేయింగ్ ఎలెవన్లో సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్లకు జట్టులో స్థానం కల్పించవచ్చు. ఈ ఇద్దరు ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించారు. సర్ఫరాజ్ ఇటీవలే ఇంగ్లండ్ లయన్స్పై సెంచరీ కూడా సాధించాడు.
We’re now on WhatsApp : Click to Join
Related News
Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. రహస్యంగా ఉంచాలని కోరిన ఐసీసీ..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు క్వాలిఫైయింగ్ మ్యాచ్లన్నీ ఒకే నగరంలో జరగాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ICCకి సూచించింది.