India vs Afghanistan: నేడు భారత్, అఫ్గానిస్థాన్ మధ్య తొలి మ్యాచ్.. విరాట్ కోహ్లీ దూరం, టీమిండియా జట్టు ఇదేనా..!
మూడు టీ20ల సిరీస్లో భాగంగా మొహాలీ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ (India vs Afghanistan) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆడే 11 మంది ఆటగాళ్లు ఎవరనేది పెద్ద ప్రశ్న.
- By Gopichand Published Date - 07:19 AM, Thu - 11 January 24
India vs Afghanistan: మూడు టీ20ల సిరీస్లో భాగంగా మొహాలీ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ (India vs Afghanistan) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆడే 11 మంది ఆటగాళ్లు ఎవరనేది పెద్ద ప్రశ్న. అయితే మ్యాచ్కు ఒక రోజు ముందు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ విలేకరుల సమావేశం నిర్వహించి పాలూ కీలక విషయాలు చెప్పాడు. ఎందుకంటే తొలి టీ20కి విరాట్ కోహ్లి దూరం కావడం. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లు అవుతారని ద్రవిడ్ ధృవీకరించాడు. దీని తర్వాత స్థానాల్లోనే గందరగోళం నెలకొంది.
తొలి టీ20కి విరాట్ కోహ్లి దూరం కాగా ఇప్పుడు ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్కు అవకాశం దక్కడం ఖాయం. అంటే మొహాలీలో జరగనున్న ఈ మ్యాచ్లో అతను 3వ నంబర్లో ఆడడం చూడవచ్చు. కానీ వైట్ బాల్ క్రికెట్లో.. గిల్ తరచుగా ఓపెనింగ్ చేస్తాడు. ఈ పరిస్థితిలో తిలక్ వర్మ, శివమ్ దూబే వంటి ఆటగాళ్లు కూడా నంబర్ 3, నంబర్ 4 కోసం పోటీదారులుగా ఉన్నారు. రింకూ సింగ్ గత కొన్ని మ్యాచ్లుగా 5వ స్థానంలో ఆడుతున్నాడు.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ తమ్ముడు గురించి మీకు తెలుసా?
సంజు శాంసన్ 6వ స్థానంలో అతనితో ఫినిషర్ పాత్రను పోషించగలడు. అంటే ఈ ఇద్దరు ఆటగాళ్లు 5వ స్థానంలో, 6వ స్థానంలో ఉంటారు. కేవలం సంజు మాత్రమే వికెట్ కీపింగ్ చేయగలడు. అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్లో ఎవరికైనా అవకాశం దక్కుతుంది. కుల్దీప్ యాదవ్ లేదా రవి బిష్ణోయ్లలో ఒకరు మాత్రమే ఆడటం కనిపిస్తుంది. అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతను నిర్వహించగలరు.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్, అఫ్గానిస్థాన్ మధ్య ఈరోజు మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్లో టాస్ రాత్రి 7 గంటలకు జరుగుతుంది. ఈ సిరీస్లో రోహిత్ శర్మ మరోసారి భారత జట్టుకు కెప్టెన్గా కనిపించనున్నాడు. విరాట్ కోహ్లి తొలి మ్యాచ్కు దూరమయ్యాడు.
We’re now on WhatsApp. Click to Join.
భారత్ జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్/శివం దూబే, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్.
Related News
Virat Kohli Record: T20 ప్రపంచ కప్ గేమ్ల్లో కోహ్లీ రికార్డులు ఇవే.. లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
కొద్ది రోజుల క్రితం విరాట్ కోహ్లీ స్లో స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడని ట్రోల్ చేశారు. ఇటీవల 67 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత స్లో సెంచరీ సాధించిన ఘనత కోహ్లిదే.