IND vs BAN 2nd Test: క్లీన్స్వీప్పై టీమిండియా కన్ను.. రేపే రెండో టెస్ట్ ప్రారంభం..!
మీర్పూర్ వేదికగా డిసెంబర్ 22 నుంచి బంగ్లాదేశ్ (IND vs BAN)తో ప్రారంభంకానున్న రెండో టెస్ట్ కోసం టీమిండియా (IND vs BAN) సన్నద్ధమవుతోంది. 2 మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్ట్ నెగ్గి ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్.. రెండో టెస్ట్లోనూ గెలుపొంది ఆతిధ్య జట్టును క్లీన్స్వీప్ చేయాలని చూస్తోంది.
- By Gopichand Published Date - 02:21 PM, Wed - 21 December 22
మీర్పూర్ వేదికగా డిసెంబర్ 22 నుంచి బంగ్లాదేశ్ (IND vs BAN)తో ప్రారంభంకానున్న రెండో టెస్ట్ కోసం టీమిండియా (IND vs BAN) సన్నద్ధమవుతోంది. 2 మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్ట్ నెగ్గి ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్.. రెండో టెస్ట్లోనూ గెలుపొంది ఆతిధ్య జట్టును క్లీన్స్వీప్ చేయాలని చూస్తోంది. బంగ్లాదేశ్ను క్లీన్స్వీప్ చేస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరే అవకాశాలు మెరుగవ్వనున్న నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్ను చాలా సీరియస్గా తీసుకుంది.
భారత్-బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య 2 మ్యాచ్ల సిరీస్లో రెండవ, చివరి టెస్ట్ మ్యాచ్ గురువారం నుండి మీర్పూర్లోని షేర్-ఇ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ సిరీస్లో ఆతిథ్య జట్టును క్లీన్స్వీప్ చేయాలని భారత్ కన్నేసిన వేళ బంగ్లాదేశ్ జట్టు మాత్రం ఎదురుదాడికి దిగాలని చూస్తోంది. ఈ టెస్టులో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరే అవకాశాన్ని టీమ్ ఇండియా పటిష్టం చేసుకోవచ్చు.
ఈ సిరీస్లోని మొదటి టెస్ట్ మ్యాచ్ చిట్టగాంగ్లో జరిగింది. ఇక్కడ ఐదో రోజు భారత జట్టు 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. టెస్ట్ మ్యాచ్ సందర్భంగా మిర్పూర్లో పగటి ఉష్ణోగ్రత 26 నుండి 27 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చు. అక్యూవెదర్ ప్రకారం.. రెండో టెస్ట్ మ్యాచ్లో వర్షం పడే అవకాశం తక్కువ.
Also Read: SA20 league: టీ20 లీగ్ ప్రకటించిన సౌత్ ఆఫ్రికా
షేర్-ఇ బంగ్లా నేషనల్ స్టేడియం పిచ్ బ్యాట్స్మెన్కు అనుకూలం. ఈ వికెట్పై ఫాస్ట్ బౌలర్లు ప్రారంభంలో సత్తా చూపవచ్చు. తర్వాత వికెట్ నెమ్మదిస్తుంది. రెండో రోజు తర్వాత ఈ వికెట్ స్పిన్నర్లకు సహకరిస్తుంది. అటువంటి పరిస్థితిలో నైపుణ్యం కలిగిన బ్యాట్స్మెన్ ఇక్కడ రాణించగలరు. ఈ పిచ్ పై వన్డేల్లో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 329 పరుగులు. మిర్పూర్ టెస్టు మ్యాచ్ లో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. బొటన వేలి గాయం కారణంగా రోహిత్ చిట్టగాంగ్ టెస్టులో కూడా ఆడలేకపోయాడు. ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ కూడా గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇటువంటి పరిస్థితిలో మీర్పూర్ టెస్ట్ మ్యాచ్లో శుభ్మన్ గిల్, కెఎల్ రాహుల్ జోడి ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది.
Related News
T20 World Cup: ప్రపంచకప్ గెలిపించే మొనగాడు అతడే
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచినప్పటికీ ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 11 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీశాడు. ప్రస్తుతం బుమ్రా పర్పుల్ క్యాప్ కలిగి ఉన్నాడు. కాగా జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్లో బుమ్రానే భారత జట్టులో కీలక ఆటగాడిగా పలువురు అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.