Rishabh Pant: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ముంబైకి తరలింపు
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) గతవారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం డెహ్రాడూన్లో మ్యాక్స్ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. అయితే పంత్ ట్రీట్మెంట్పై ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(DDCA) తాజా అప్డేట్ ఇచ్చింది.
- By Gopichand Published Date - 01:42 PM, Wed - 4 January 23
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) గతవారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం డెహ్రాడూన్లో మ్యాక్స్ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. అయితే పంత్ ట్రీట్మెంట్పై ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(DDCA) తాజా అప్డేట్ ఇచ్చింది. తదుపరి ట్రీట్మెంట్ కోసం పంత్ను డెహ్రాడూన్ నుంచి ముంబైకి తరలించనున్నట్లు డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు.
భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రూర్కీ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అతని చికిత్స డెహ్రాడూన్లో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) పెద్ద నిర్ణయం తీసుకుంది. DDCA చికిత్స కోసం పంత్ను ముంబైకి తీసుకెళ్లనుంది. డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ మాట్లాడుతూ.. క్రికెటర్ రిషబ్ పంత్ను తదుపరి చికిత్స కోసం ముంబైకి తరలించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 30న కారు ప్రమాదంలో గాయపడిన పంత్ డెహ్రాడూన్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పంత్ తలపై రెండు కుట్లు ఉన్నాయని బీసీసీఐ తెలిపింది. అతని కుడి మోకాలిలో గాయమైంది. కుడి మణికట్టు, చీలమండ, కాలికి కూడా గాయాలు ఉన్నాయి. అలాగే అతని వీపుపై రాపిడి గాయం ఉంది. పంత్ పరిస్థితి ప్రస్తుతం ప్రమాదంగా లేదు. అయితే ఇప్పుడు అతనికి మెరుగైన చికిత్స అందించాలని BCCI, DDCA నిర్ణయించాయి. త్వరలో జరగనున్న వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని పంత్ను వీలైనంత త్వరగా ఫిట్గా ఉండేలా చూడాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read: Woman Suicide: హైదరాబాద్ లో మెట్రో రైల్వేస్టేషన్ పై నుండి దూకి మహిళ ఆత్మహత్య
పంత్ MRI స్కాన్ నివేదికలో ఎటువంటి సమస్య లేదు. ప్రమాదం తర్వాత పంత్తో నిరంతరం టచ్లో ఉండాలని, అతని పరిస్థితిని పర్యవేక్షించాలని BCCI.. DDCAని ఆదేశించింది. డీడీసీఏ చీఫ్ శ్యామ్ శర్మ స్వయంగా పంత్ను కలిసేందుకు వచ్చారు. అలాగే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా పంత్ను కలవడానికి ఆసుపత్రికి చేరుకున్నారు.
బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడిన తర్వాత పంత్ దుబాయ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి డిసెంబర్ 29న ఢిల్లీకి వచ్చి అక్కడి నుంచి కారులో రూర్కీలోని తన ఇంటికి వెళ్తున్నాడు. శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్లకు భారత జట్టులో పంత్కు చోటు దక్కలేదు. ఇప్పుడు గాయం తర్వాత పంత్ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్, IPL 2023లో ఆడటంపై సందేహం ఉంది. మీడియా నివేదికల ప్రకారం.. పంత్ పూర్తిగా కోలుకోవడానికి నాలుగు నుండి ఆరు నెలలు పట్టవచ్చు.
Related News
Selection Committee: టీమిండియా సెలక్షన్ కమిటీపై మాజీ క్రికెటర్ ఫైర్..!
టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ భారత సెలక్షన్ కమిటీపై తీవ్ర ఆరోపణలు చేశారు.