Rescheduled: ప్రపంచ కప్ కొత్త షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్తాన్తో సహా 8 మ్యాచ్ల షెడ్యూల్ మార్పు..!
భారత్-పాకిస్థాన్ మ్యాచ్తో పాటు 8 మ్యాచ్ల షెడ్యూల్ను (Rescheduled) మార్చారు. ఐసీసీ కొత్త షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 10న ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది.
- By Gopichand Published Date - 07:58 AM, Thu - 10 August 23
Rescheduled: 2023 ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. అయితే, ముందుగా ఈ మ్యాచ్ను అక్టోబర్ 15 అని నిర్ణయించారు. కానీ తరువాత దానిని మళ్లీ మార్చారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్తో పాటు 8 మ్యాచ్ల షెడ్యూల్ను (Rescheduled) మార్చారు. ఐసీసీ కొత్త షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 10న ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో అక్టోబర్ 10న పాకిస్థాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ కూడా జరగనుంది. ఉదయం 10.30 గంటలకు ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. పాకిస్థాన్, శ్రీలంక మధ్య మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ల షెడ్యూల్ను ఐసీసీ మార్చింది
అదే సమయంలో అక్టోబర్ 12న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 13న న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి జరగనుంది. కాగా అక్టోబర్ 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Also Read: IND Beat PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్ జట్టు
భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్ షెడ్యూల్ కూడా మారింది
నవంబర్ 11న ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మ్యాచ్ జరగనుంది. నవంబర్ 11న ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి జరగనుంది. అదే సమయంలో నెదర్లాండ్స్ తో భారత్ మ్యాచ్ నవంబర్ 12న జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి భారత్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Related News
India vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. సోషల్ మీడియాలో ప్రోమో వీడియో వైరల్..!
T20 వరల్డ్ కప్ 2024.. IPL 2024 ఫైనల్ తర్వాత ప్రారంభమవుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నీ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది.