IND vs ENG: టాస్ గెలిచిన టీమిండియా.. భారత్ జట్టు ఇదే..!
భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా విశాఖపట్నం వేదికగా రెండో మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
- By Gopichand Published Date - 09:24 AM, Fri - 2 February 24
IND vs ENG: భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా విశాఖపట్నం వేదికగా రెండో మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో రజత్ పాటిదార్కు భారత్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఈ మ్యాచ్లో రజత్తో పాటు కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ కూడా ప్లేయింగ్-11లో చోటు దక్కించుకున్నారు.
ఈ మ్యాచ్లో రాణించి సిరీస్లో పునరాగమనం చేయాలని టీం ఇండియా కోరుకుంటోంది. రజత్ పాటిదార్ను ప్లేయింగ్ ఎలెవన్లో ఉంచారు. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్పై పాటిదార్ సెంచరీ సాధించాడు. పాటిదార్ ఇంతకు ముందు దేశవాళీ మ్యాచ్ల్లో కూడా మంచి ప్రదర్శన చేశాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో విజిటింగ్ టీమ్ 1-0 ఆధిక్యంలో ఉంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 28 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఇలాంటి పరిస్థితిలో రోహిత్ శర్మ జట్టు ఈ మ్యాచ్లో గెలవాలని చూస్తున్నారు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయం కారణంగా ఈ టెస్టు మ్యాచ్కు దూరమయ్యారు.
Congratulations to Rajat Patidar who is all set to make his Test Debut 👏👏
Go well 👌👌#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/FNJPvFVROU
— BCCI (@BCCI) February 2, 2024
Also Read: IND vs ENG: నేడు భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు.. టీమిండియా జట్టు ఇదే..!?
భారత్ ప్లేయింగ్ 11 – యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్.
ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 – జాక్ క్రౌలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.
We’re now on WhatsApp : Click to Join
Related News
Virat Kohli Record: T20 ప్రపంచ కప్ గేమ్ల్లో కోహ్లీ రికార్డులు ఇవే.. లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
కొద్ది రోజుల క్రితం విరాట్ కోహ్లీ స్లో స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడని ట్రోల్ చేశారు. ఇటీవల 67 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత స్లో సెంచరీ సాధించిన ఘనత కోహ్లిదే.