IND vs ENG: భారత్- ఇంగ్లాండ్ నాల్గవ టెస్ట్.. రెండో రోజు ఆటకు వర్షం ముప్పు?!
రెండవ రోజు ఆటలో వర్షం కారణంగా ఓవర్లు తగ్గితే భారత జట్టు ఇష్టపడదు. భారత ఇన్నింగ్స్ను రవీంద్ర జడేజా (19*), శార్దూల్ ఠాకూర్ (19) కొనసాగించనున్నారు. భారత్ ఈ మొదటి ఇన్నింగ్స్లో కనీసం 400 పరుగుల స్కోరు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- By Gopichand Published Date - 03:07 PM, Thu - 24 July 25

IND vs ENG: మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్లో భారత్, ఇంగ్లాండ్ (IND vs ENG) మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రెండవ రోజుకు చేరుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (58), సాయి సుదర్శన్ (61) అర్ధ సెంచరీలు సాధించగా, రిషభ్ పంత్ కాలికి బంతి తగలడంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.
ఈ టెస్ట్ మ్యాచ్లో వాతావరణం కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా వర్షం కారణంగా ఆట ఆగిపోయే అవకాశం ఉండటంతో టీమ్ ఇండియాకు ఇది ప్రతికూలంగా మారనుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ ప్రస్తుతం సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ టెస్ట్ డ్రా అయితే బెన్ స్టోక్స్ జట్టు సిరీస్ ఓటమి ప్రమాదం నుండి బయటపడుతుంది. అప్పుడు శుభ్మన్ గిల్ జట్టు చివరి టెస్ట్ను గెలిచినా సిరీస్ను కేవలం సమం చేయగలుగుతుంది తప్ప గెలవలేదు. అందువల్ల నాలుగో టెస్ట్లో వర్షం టీమ్ ఇండియాకు ఎక్కువ ఇబ్బందిని కలిగిస్తుంది.
Also Read: Ravindra Jadeja : అరుదైన ఘనతకు అడుగు దూరంలో రవీంద్ర జడేజా
రెండవ రోజు వాతావరణ నివేదిక (మాంచెస్టర్)
మొదటి సెషన్ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు – భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:30 వరకు వర్షం కురిసే అవకాశం 20% మాత్రమే. మేఘావృత వాతావరణం ఉంటుంది. మొదటి సెషన్లో వర్షం అంతగా ప్రభావం చూపకపోవచ్చు.
రెండవ సెషన్: ఈ సెషన్ చివరి 5 ఓవర్లలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చు. ఈ సమయంలో కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అయితే బ్యాటింగ్కు అనుకూలంగా ఉండొచ్చు.
మూడవ సెషన్: ఈ సెషన్లో వర్షం కురిసే అవకాశం 50% వరకు ఉంది. ఇది బౌలర్లకు అనుకూలంగా ఉండొచ్చు. వర్షం కారణంగా ఆట నిలిచిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తక్కువ ఓవర్ల ఆట మాత్రమే జరిగితే బ్యాట్స్మెన్లకు సవాలుగా మారవచ్చు. ఈ సెషన్లో కూడా ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉంటుంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా.
రెండవ రోజు ఆటలో వర్షం కారణంగా ఓవర్లు తగ్గితే భారత జట్టు ఇష్టపడదు. భారత ఇన్నింగ్స్ను రవీంద్ర జడేజా (19*), శార్దూల్ ఠాకూర్ (19) కొనసాగించనున్నారు. భారత్ ఈ మొదటి ఇన్నింగ్స్లో కనీసం 400 పరుగుల స్కోరు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.