IND vs ENG : ఇంగ్లాండ్ దే హైదరాబాద్ టెస్ట్.. ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి
IND vs ENG : సొంతగడ్డపై భారత్ కు షాక్ తగిలింది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- By Pasha Published Date - 06:42 PM, Sun - 28 January 24
IND vs ENG : సొంతగడ్డపై భారత్ కు షాక్ తగిలింది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో నాలుగోరోజు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్పిన్నర్ల ఆధిపత్యం కనబరిచిన ఈ మ్యాచ్ లో నాలుగోరోజు తొలి సెషన్ లో ఇంగ్లాండ్ భారీస్కోరు చేయడం మ్యాచ్ ను మలుపుతిప్పింది. సెంచరీతో కీలక ఇన్నింగ్ల్ ఆడిన ఓలే పోప్ డబుల్ సెంచరీ చేజార్చుకున్నా స్పిన్ పిచ్ పై భారత్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్ ఉంచగలిగాడు. ఓ దశలో ఇంగ్లాండ్ 163 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచింది. కానీ, పోప్ ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. బెన్ ఫోక్స్తో కలిసి ఆరో వికెట్కు 112 పరుగులు, రెహాన్ అహ్మద్తో కలిసి ఏడో వికెట్కు 64, ఎనిమిదో వికెట్కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 420 రన్స్ కు ఆలౌట్ అయింది. దీంతో భారత్(IND vs ENG) 231 రన్స్ టార్గెట్ నిర్దేశించింది.
We’re now on WhatsApp. Click to Join.
టీమిండియా బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు, అశ్విన్ మూడు, జడేజా రెండు, అక్షర్ ఒక్క వికెట్ తీశారు. 231 పరుగుల లక్ష్య చేధనలో భారత్ నిలకడగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు తొలి వికెట్ కి 42 రన్స్ జోడించారు. అయితే జైస్వాల్ , గిల్ వెంట వెంటనే ఔట్ అవడం, దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ కూడా వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది. ఇక్కడ నుంచి వికెట్ల పతనం క్రమం తప్పకుండా కొనసాగింది. అక్షర్ పటేల్ 17 , కెఎల్ రాహుల్ 22 పరుగులకు ఔటవగా…జడేజా రనౌట్ కూాడా కొంపముంచింది. శ్రేయాస్ అయ్యర్ కూడా నిరాశపరచడంతో ఓటమి ఖాయమైపోయింది. అయితే కెఎస్ భరత్ , అశ్విన్ 55 పరుగుల పార్టనర్ షిప్ తో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివర్లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరో అరగంట సేపు ఆట కొనసాగించే నిబంధనను వాడుకోవడంతో ఒత్తిడి పెరిగింది. ఫలితంగా శ్రీకర్ భరత్, అశ్విన్ వెంటవెంటనే ఔటయ్యారు.
Also Read :Turkey: టర్కీలో చర్చిపై సాయుధ దాడి.. ఒకరు మృతి
చివర్లో బుమ్రా, సిరాజ్ అసాధారణ బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. ఆఖరి వికెట్కు 25 పరుగులు జోడించి ఆశలు రేకెత్తించారు. సిరాజ్ స్టంపౌటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ కు 202 పరుగులకు తెరపడింది. ఇంగ్లాండ్ తరపున అరంగేట్రం చేసిన టామ్ హర్ట్ లీ 7 వికెట్ల తో భారత్ ను దెబ్బతీశాడు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి జరుగుతుంది.
Related News
RR vs PBKS: బట్లర్ లేకుండానే బరిలోకి.. రాజస్థాన్ రాయల్స్ లో మైనస్ అదే
రాజస్థాన్ ఆడబోయే మిగతా మ్యాచ్ ల్లో జొస్ బట్లర్ లేకపోవడం ఆ జట్టుకు మైనస్ గా మారింది. టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లాండ్ ప్లేయర్స్ తమ దేశానికి తిరిగిరావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశించింది. దీంతో బట్లర్ జట్టుని వీడి స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు.