IND vs BAN T20Is: బంగ్లాతో టీ20 సిరీస్.. ఈ ఆటగాళ్లకు విశ్రాంతి..?
భారత్-బంగ్లాదేశ్ మధ్య అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న 3 టీ20 క్రికెట్ మ్యాచ్ల సిరీస్ కోసం త్వరలో టీమ్ ఇండియాను బీసీసీఐ ప్రకటించనుంది. ఈ సిరీస్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పునరాగమనం చేయనున్నాడు.
- By Gopichand Published Date - 07:15 PM, Thu - 26 September 24

IND vs BAN T20Is: భారత్, బంగ్లాదేశ్ (IND vs BAN T20Is) మధ్య రెండు టెస్టుల క్రికెట్ సిరీస్ జరుగుతుండగా ఇందులో టీమ్ ఇండియా 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్లో టీమిండియా తదుపరి టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత భారత క్రికెట్ జట్టు అక్టోబర్ 6 నుంచి బంగ్లాదేశ్తో 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో చాలా మంది స్టార్ ప్లేయర్లు టీమ్ ఇండియాకు తిరిగి రానున్నారు. అందులో అతిపెద్ద పేరు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. గాయం తర్వాత సూర్యకుమార్ యాదవ్ టీమ్ ఇండియాకు తిరిగి రానున్నాడు.
ఈ ఆటగాళ్ళు విశ్రాంతి తీసుకోవచ్చు
ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో టీ20 క్రికెట్ ఆడేందుకు 13 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. మిగిలిన 13 మంది ఆటగాళ్లలో న్యూజిలాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ కోస గిల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లకు టి20 క్రికెట్ సిరీస్లో విశ్రాంతి ఇవ్వవచ్చని భావిస్తున్నారు.
Also Read: Ashish Nehra: జాక్ పాట్ కొట్టిన ఆశిష్ నెహ్రా.. గుజరాత్ ప్రధాన్ కోచ్గా భారీ వేతనం..!
బంగ్లా టీ20 సిరీస్కు వీరు అందుబాటులో
భారత్-బంగ్లాదేశ్ మధ్య అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న 3 టీ20 క్రికెట్ మ్యాచ్ల సిరీస్ కోసం త్వరలో టీమ్ ఇండియాను బీసీసీఐ ప్రకటించనుంది. ఈ సిరీస్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పునరాగమనం చేయనున్నాడు. సూర్యతో పాటు రితురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ముఖేష్ కుమార్, అవేశ్ ఖాన్, సంజూ శాంసన్లను జట్టులోకి తీసుకోవచ్చు. వీరే కాకుండా ఖలీల్ అహ్మద్, యష్ దయాల్, శివమ్ దూబే ఈ ముగ్గురిలో ఎవరైనా జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
మీరు మ్యాచ్ ఎక్కడ చూడవచ్చు..?
భారతదేశం- బంగ్లాదేశ్ మధ్య జరిగే ఈ 3 T20 మ్యాచ్లను జియో సినిమా మొబైల్ యాప్, వెబ్సైట్లో ఉచితంగా చూడవచ్చు. ఈ మ్యాచ్లు రాత్రి 7 గంటల నుంచి జరగనున్నాయి.