IND Vs AUS: నేడు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే.. టీమిండియా సిరీస్ గెలుస్తుందా.. చతికిలపడుతుందా..?
చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా (IND Vs AUS) మధ్య వన్డే సిరీస్లో మూడో, చివరి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత్కు చాలా కీలకం. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో జరిగిన తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. రోహిత్ శర్మ సారథ్యంలో రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
- By Gopichand Published Date - 06:18 AM, Wed - 22 March 23
వన్డే సిరీస్ గెలుపు మీద నీలినీడలు కమ్ముకున్నాయి. మొదటి మ్యాచ్లో గెలిచిన తర్వాత వైజాగ్ వన్డేతోనే సిరీస్ కైవసం అవుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. అంతే కాకుండా మనోళ్ల బ్యాటింగ్పై కొత్త అనుమానాలు రేకెత్తాయి. నేడు చెన్నై వేదికగా మూడో వన్డే జరగనుంది. ఇప్పటి వరకు 1-1తో ఇరుజట్లు సమానంగా ఉన్నాయి. నేటి పోరులో గెలిచే వారికే సిరీస్ దక్కనుంది.
చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా (IND Vs AUS) మధ్య వన్డే సిరీస్లో మూడో, చివరి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత్కు చాలా కీలకం. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో జరిగిన తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. రోహిత్ శర్మ సారథ్యంలో రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మూడో, చివరి మ్యాచ్ నుంచే సిరీస్ ఖరారు కానుంది.
Also Read: Mumbai Indians: చివరి మ్యాచ్ లోనూ ఓడిన బెంగళూరు
ఈ సిరీస్లో భారత టాప్ ఆర్డర్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. తొలి మ్యాచ్లో ఆ జట్టు 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అదే సమయంలో రెండో మ్యాచ్లో జట్టు మొత్తం 117 పరుగులకే కుప్పకూలింది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ అండ్ కో మూడో వన్డేలో బాగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. మిచెల్ స్టార్క్ గత రెండు వన్డేల్లో టీమిండియాపై స్వింగ్తో విధ్వంసం సృష్టించాడు.
రెండో వన్డేలో మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ల ముందు భారత బౌలర్లు కూడా చాలా పేలవంగా బౌలింగ్ చేశారు. ఒకవేళ వన్డే సిరీస్ టీమ్ ఇండియా ఓడిపోతే 2019 మార్చి తర్వాత స్వదేశంలో జట్టుకు ఇదే తొలి సిరీస్ ఓటమి. మార్చి 2019లో ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా 3-2తో భారత్ను ఓడించింది. చెన్నైలో జరిగిన వన్డేల్లో భారత్, ఆస్ట్రేలియాలు రెండుసార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఒక మ్యాచ్లో భారత్, ఒక మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించాయి. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో వన్డే బుధవారం చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
Related News
Centuries In IPL: ఐపీఎల్లో సెంచరీల మోత.. ఇప్పటివరకు ఆరు శతకాలు.. బట్లరే రెండు బాదాడు..!
ఈ ఏడాది ఐపీఎల్లో భారీ స్కోర్లు నమోదు చేసే ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు సార్లు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ స్కోర్లను నమోదు చేసింది.