1st Match: ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో తుది జట్లు ఇవే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ కు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది.
- By Naresh Kumar Published Date - 05:54 PM, Fri - 25 March 22
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ కు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ళ తర్వాత స్వదేశంలో జరగనున్న ఈ మెగా లీగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టేడియం కెపాసిటీలో 25 శాతం మందిని అనుమతించనుండగా.. ఇప్పటికే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. శనివారం రాత్రి 7.30కి వాంఖేడే స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఐపీఎల్ 2022 సీజన్ చెన్నై జట్టు గ్రూపు-బిలో ఉండగా.. కోల్కతా జట్టు గ్రూపు- ఎలో ఉంది. ఇక లీగ్ దశలో ఈ రెండు జట్లు ఒక్కసారి మాత్రమే పోటీపడనున్నాయి. గత సీజన్ ఫైనలిస్టుల మధ్యనే తర్వాతి సీజన్ ఆరంభ మ్యాచ్ నిర్వహించే సంప్రదాయం ప్రకారమే రెండు జట్ల మధ్య పోరు జరగనుంది.
ఇక ఐపీఎల్ లో ఇప్పటి వరకు చెన్నై, కేకేఆర్ ఇరు జట్లు 26 మ్యాచ్ల్లో పోటీ పడ్డాయి.. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 17 మ్యాచుల్లో గెలువగా.. కేకేఆర్ జట్టు 8 మ్యాచుల్లో గెలిచింది.. ఒక దాంట్లో ఫలితం తేలలేదు.. ఇక కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా సారథ్యంలోని చెన్నై తుది జట్టుని పరిశీలిస్తే.. రుతు రాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే ఓపెనర్లుగా రానుండగా..మూడో స్థానంలో మొయిన్ అలీ లేకపోవడంతో ఊతప్పకు అవకాశం రానుంది. మిడిల్ ఆర్డర్ లో అంబటి రాయుడు, ఎంఎస్ ధోని లోయర్ ఆర్డర్ లో శివమ్ దుబే , రవీంద్ర జడేజా రానున్నారు.. ఇక చెన్నై బౌలింగ్ విషయానికొస్తే.. బ్రేవో , శివమ్ దూబె ,మిచెల్ సాంట్నర్, క్రిస్ జోర్డాన్ , తుషార్ దేశ్ పాండేలకు తుది జట్టులో చోటు దక్కనుంది.
మరోవైపు శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ తుది జట్టు కూర్పును పరిశీలిస్తే వెంకటేష్ అయ్యర్ , నితీష్ రానా ఓపెనర్లుగా రానుండగా .. మూడో స్థానంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ,మిడిల్ ఆర్డర్ లో రింకు సింగ్, సామ్ బిల్లింగ్స్ లోయర్ ఆర్డర్ లో రస్సెల్, నరైన్ రానున్నారు.. ఇక కేకేఆర్ బౌలింగ్ విభాగం విషయానికొస్తే..వరుణ్ చక్రవర్తి, టిమ్ సౌథీ, శివమ్ మావి , ఉమేష్ యాదవ్ అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందనే విషయానికొస్తే…. కోల్కతా కంటే అన్ని విబాగాల్లో బలంగా ఉన్న చెన్నై జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఐఎల్2021 సీజన్ ఫైనల్లో సీఎస్కే 27 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించి ఐపీఎల్ 2021 విజేతగా నిలిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై 3 వికెట్లకు 192 పరుగులు చేయగా…భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న వాంఖేడే స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశముంది. ఇక్కడ ఛేజింగ్ జట్లు ఎక్కువ సార్లు విజయాలు సాధించాయి. సీజన్ ఆరంభ మ్యాచ్ కావడం, రెండు జట్లలోనూ పలువురు హిట్టర్లు ఉండడంతో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది.
Tags
Related News
IPL 2024 Tickets: అభిమానులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి IPL ప్లేఆఫ్ టిక్కెట్లు..!
ఐపీఎల్ 2024 క్రమంగా ప్లేఆఫ్ల దిశగా సాగుతోంది. టోర్నీలో 70 లీగ్ మ్యాచ్లు జరగాల్సి ఉండగా అందులో 63 మ్యాచ్లు జరిగాయి.