KL Rahul: రెండో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్.. కేఎల్ రాహుల్ దూరం..?
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కావడానికి ముందు భారత జట్టు కొత్త సమస్యలో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. రోహిత్ శర్మ గాయం తర్వాత తొలి టెస్టుకు కెప్టెన్సీ వహించిన కేఎల్ రాహుల్ (KL Rahul) కూడా గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాహుల్ (KL Rahul) గాయపడ్డాడు.
- By Gopichand Published Date - 07:20 AM, Thu - 22 December 22
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కావడానికి ముందు భారత జట్టు కొత్త సమస్యలో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. రోహిత్ శర్మ గాయం తర్వాత తొలి టెస్టుకు కెప్టెన్సీ వహించిన కేఎల్ రాహుల్ (KL Rahul) కూడా గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాహుల్ (KL Rahul) గాయపడ్డాడు. ఇప్పుడు అతనికి రెండవ మ్యాచ్లో ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్లో రాహుల్ ఆడేందుకు రాకపోతే భారత జట్టుకు కొత్త కెప్టెన్ లభించే అవకాశం ఉంది.
ఒకవేళ రాహుల్ ఈ మ్యాచ్కు ఫిట్గా లేకుంటే పుజారా జట్టుకు కెప్టెన్సీని అందుకోవచ్చు. ప్రస్తుతం పుజారా జట్టుకు వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్లో అతనికి కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంది. రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ రూపంలో జట్టులో మరో ఇద్దరు కెప్టెన్సీ ఎంపికలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పుజారాకు కెప్టెన్సీ లభించే అవకాశం ఉంది. రాహుల్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ అరంగేట్రం చేయొచ్చు.
Also Read: IND vs BAN 2nd Test: క్లీన్స్వీప్పై టీమిండియా కన్ను.. రేపే రెండో టెస్ట్ ప్రారంభం..!
రాహుల్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడిని డాక్టర్లు పరిశీలిస్తున్నారు. అయితే రాహుల్ రెండు టెస్టులో ఆడతాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని, ఒకవేళ రాహుల్ దూరమైతే పుజారాకు కెప్టెన్సీ అప్పగించే అవకాశాలున్నాయని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తెలిపారు. రెండు టెస్టుల సిరీస్లో మొదటి టెస్ట్లో భారత్ గెలిచింది. చటోగ్రామ్లో జరిగిన టెస్టులో విజయం సాధించి సిరీస్లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు మిర్పూర్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన భారత జట్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలనుకుంటుంది. బంగ్లాదేశ్పై భారత్ క్లీన్ స్వీప్ చేస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో పాయింట్ల పట్టికలో భారత్ బంపర్ అడ్వాంటేజ్ అందుకుంటుంది.
Related News
MI vs LSG: నేడు లక్నో వర్సెస్ ముంబై.. విజయంతో ముగించే జట్టు ఏదో..?
IPL 2024 లీగ్ దశ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది.