Australia Squad: భారత్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..!
భారత్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును (Australia Squad) ప్రకటించింది.
- By Gopichand Published Date - 01:10 PM, Sat - 28 October 23
Australia Squad: భారత్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును (Australia Squad) ప్రకటించింది. భారత్తో జరిగే టీ20 సిరీస్లో పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, జోష్ హేజిల్వుడ్లకు విశ్రాంతినిచ్చారు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ మళ్లీ టీ20 జట్టులోకి వచ్చారు. భారత్తో జరిగే టీ20 సిరీస్లో కమిన్స్, మార్ష్, హేజిల్వుడ్లతో పాటు ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్, ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్లకు కూడా విశ్రాంతి కల్పించారు. అయితే స్పిన్ ఆల్ రౌండర్ అష్టన్ అగర్ ఇంకా పూర్తి ఫిట్గా లేడు. ఎంపికకు అందుబాటులో లేడు.
మాథ్యూ వేడ్ కెప్టెన్సీ, స్మిత్, వార్నర్ తిరిగి జట్టులోకి
భారత్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కంగారూ జట్టుకు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మాథ్యూ వేడ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్తో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు. దీంతో పాటు ట్రావిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, టిమ్ డేవిడ్ కూడా ఈ సిరీస్లో ఆస్ట్రేలియా జట్టులో భాగం కానున్నారు.
Also Read: INDIA 100 Medals : పారా ఆసియా గేమ్స్లో ఇండియా ‘సెంచరీ’.. పారా అథ్లెట్లకు సలాం
ప్రపంచకప్కు ముందు భారత్, ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేల సిరీస్ జరిగింది. దీని తర్వాత ఇరు జట్లు ప్రపంచకప్లో ఆడుతున్నాయి. ఈ టోర్నీ అనంతరం ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ నవంబర్ 23న జరగనుండగా, రెండో మ్యాచ్ నవంబర్ 26న త్రివేండ్రంలో జరగనుంది. సిరీస్లోని మూడో టీ20 నవంబర్ 28న గౌహతిలో, నాలుగో టీ20 డిసెంబర్ 1న నాగ్పూర్లో జరగనుంది. సిరీస్లో చివరి మ్యాచ్ డిసెంబర్ 3న హైదరాబాద్లో జరగనుంది. అన్ని మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల నుంచి జరుగుతాయి.
We’re now on WhatsApp. Click to Join.
భారత్తో టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (కెప్టెన్), జాసన్ బెహ్రెన్డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘ, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.
Tags
Related News
Mall : మాల్లో కత్తిపోట్ల కలకలం.. నలుగురి మృతి!
Sydney mall: ఆస్ట్రేలియా(Australia) రాజధాని సిడ్నీ(Sydney)లోని ఓ షాపింగ్ మాల్(Shopping mall)లో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు, పలువురు గాయపడ్డట్టు సమాచారం. సిడ్నీలోని బోండీ జంక్షన్ పరిధిలో గల వెస్ట్ఫీల్డ్ మాల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు బీఎన్ఓ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. We’re now on WhatsApp. Click to Join. BREAKING: Multiple people injured in stabbing at Westfield Bo