HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ysrtp Chief Ys Sharmila Meets Dk Shivakumar In Karnataka

YS Sharmila: డీకేతో భేటీ అయిన షర్మిల.. డీల్ ఫిక్స్ అయినట్టేనా?

వైఎస్ఆర్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు సోమవారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలిశారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఎన్నికైనందుకు ఆమె అభినందనలు తెలిపారు.

  • Author : Praveen Aluthuru Date : 29-05-2023 - 2:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Sharmila
Whatsapp Image 2023 05 29 At 2.40.33 Pm

YS Sharmila: వైఎస్ఆర్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఈ రోజు సోమవారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలిశారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఎన్నికైనందుకు ఆమె అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆమె బెంగుళూరులోని డీకే శివకుమార్ ఛాంబర్ లో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో డీకే కీలక పాత్ర పోషించాడని, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వెనుక శివకుమార్ పాత్ర ఎంతో ఉన్నదని ఆమె అన్నారు. ఈ సందర్భంగా డీకేతో రాజకీయ చర్చలు జరిపారు. ఈ భేటీలో డీకే శివకుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పేరు మారుమ్రోగింది. అధికార పార్టీని వెనక్కినెట్టి అక్కడ భారీ మెజారీటీతో గెలుపొందింది. అక్కడ బీజేపీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో అక్కడ కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ (DK Shivakumar) లు ఎన్నికయ్యారు. కర్ణాటక ఫలితాల తరువాత కాంగ్రెస్ చూపు తెలంగాణపై పడింది. తెలంగాణాలో వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్రంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలతో మంతనాలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణాలో బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షర్మిలతో ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది. గంటపాటు జరిగిన ఫోన్ సంభాషణలో తెలంగాణ రాజకీయాలపై కూలంకషంగా చర్చించినట్టు సమాచారం

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన షర్మిల అధికార పార్టీ బీఆర్ఎస్ పై ఎప్పటికప్పుడు విమర్శలతో విరుచుకుపడుతుంది. రాష్ట్రంలో అధికార పార్టీ తప్పులను ఎత్తిచూపుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుందామె. తాజాగా షర్మిల ప్రియాంక గాంధీతో సంభాషణ తరువాత కాంగ్రెస్, వైఎస్ఆర్టీపి పార్టీల మధ్య సంధి కుదిరినట్టు స్పష్టం అవుతుంది. తెలంగాణాలో కాంగ్రెస్, వైఎస్ఆర్టీపి పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్టు, సీఎం కెసిఆర్ ని గద్దె దెంచడమే లక్ష్యంగా ఆ రెండు పార్టీలు సన్నద్ధమైనట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో డీకే శివకుమార్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా పావులు కదుపుతున్నారు. వైఎస్ఆర్ తో తనకున్న సాన్నిహిత్యంతో శివకుమార్ షర్మిలతో ఇప్పటికే మాట్లాడినట్టు నెక్స్ట్ ఎలెక్షన్స్ ని టార్గెట్ చేస్తూ ఇరు పార్టీలు బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసినట్టు భావిస్తున్నారు.

తెలంగాణాలో బీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎదిగింది. కెసిఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారి జాతీయ పార్టీగా అవతరించింది. దీంతో తెలంగాణాలో ఆ పార్టీకి మరింత బలం చేకూరింది. దీంతో తెలంగాణాలో కెసిఆర్ లాంటి బలమైన నాయకుడిని ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుంటే అధికారం చేపట్టాలని భావిస్తోంది కాంగ్రెస్. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం దృష్టి వైఎస్ షర్మిలపై పడిందని తెలుస్తోంది. ఇటువంటి సమయంలో షర్మిల కర్ణాటక వెళ్ళి కర్ణాటకలో కాంగ్రెస్ విజయంలో కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్‌తో సమావేశం కావటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read More: Delhi Jagan : చీక‌ట్లో ఆ 2గంట‌లు సీక్రెట్‌, జ‌గ‌న్ హ‌స్తిన అవ‌లోక‌నం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cm kcr
  • congress
  • DK Shivakumar
  • karnataka
  • Priyanka gandhi
  • telangana congress
  • telangana politics
  • ys sharmila
  • ysrtp

Related News

Telangana, Mla Defection

సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్

Supreme Court  తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలందరికీ క్లీన్‌చిట్ ఇస్తూ ఇటీవల స్పీకర్ తుది నిర్ణయం వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. ఇక ఈ పిటిషన్‌పై విచారణ జరపాల్సిన అవసరం లేదని

  • Speaker Clean Chit To Danam, Kadiyam Srihari

    కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

  • Ktr

    పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Kavita Fire

    Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

  • Abhishek Manu Singhvi And V

    Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!

Latest News

  • Jobs : నిరుద్యోగులకు గొప్ప శుభవార్త.. రైల్వేలో వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

  • Ustaad Bhagat Singh : తెలంగాణ లో సాధారణ టికెట్ ధరలతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’

  • Donald Trump : ట్రంప్ కు మరో భారీ షాక్

  • Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

  • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

Trending News

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd