Suicide : ప్రియురాలిని బ్లాక్మెయిల్ చేసిన ప్రియుడు.. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి
ప్రియురాలి వీడియోలు సోషల్ మీడియలో పెడతానని ఓ ప్రియుడు వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన..
- By Prasad Published Date - 11:29 AM, Tue - 8 November 22
ప్రియురాలి వీడియోలు సోషల్ మీడియలో పెడతానని ఓ ప్రియుడు వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఓ బ్యూటీపార్లర్లో పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన మల్లికార్జున్కు.. చాముండేశ్వరి అను మహిళతో ఆరు నెలల క్రితం పరిచయమయ్యాడు. ఇద్దరూ సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నారు. అయితే నిందితులు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే తమ వీడియోలు, ఫొటోలు అన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. 35 ఏళ్ల చాముండేశ్వరి తనకు ఎదురైన కష్టాలను వివరిస్తూ వీడియో తీసింది. గత వారం ఆత్మహత్యకు ముందు మృతురాలు తీసిన వీడియోను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చాముండేశ్వరి భర్త ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్కు చెందిన మల్లికార్జున్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిద్దరి మధ్య వాట్సాప్ కాల్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మల్లికార్జున్ కోసం గాలిస్తున్నారు.
Related News
Five Burnt Alive : ఐదుగురు సజీవ దహనం.. ప్రైవేట్ ట్రావెల్స్ను ఢీకొన్న టిప్పర్
ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది.