HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Watch Indian Army Releases Another Video Of Operation Sindoor

Indian Army: ఆపరేషన్ సిందూర్‌.. మరో వీడియో విడుద‌ల చేసిన ఇండియ‌న్ ఆర్మీ!

వీడియోలో చూపిన దాడులు మురిద్కే, బహవల్పూర్, కోట్లీ, ముజఫ్ఫరాబాద్ వంటి ప్రాంతాలలోని ఉగ్రవాద స్థావరాలపై జరిగినవి. ఈ దాడులు ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా, పౌరులకు హాని కలగకుండా జాగ్రత్తగా నిర్వ‌హించారు.

  • By Gopichand Published Date - 11:15 AM, Sun - 18 May 25
  • daily-hunt
Indian Army
Indian Army

Indian Army: భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన మరో వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం Xలో షేర్ చేసింది. ఈ వీడియోలో భారత సైనికులు (Indian Army) ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేస్తూ భారత సైన్యం ఇలా రాసుకొచ్చింది. “ప్రణాళిక వేశాం, శిక్షణ తీసుకున్నాం, చర్య తీసుకున్నాం. న్యాయం జరిగింది.” ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్‌కు ఒక పాఠం అని, దశాబ్దాలుగా అది నేర్చుకోని పాఠం అని సైన్యం పేర్కొంది.

“ఇది పహల్గామ్ ఉగ్రవాద దాడితో ప్రారంభమైంది. ఇది ప్రతీకార భావన కాదు, ఇది న్యాయం. మే 9 రాత్రి 9 గంటల సమయంలో ఏ శత్రు పోస్టు సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించిందో ఆ పోస్టులన్నింటినీ భారత సైన్యం ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక చర్య కాదు.. ఇది పాకిస్తాన్‌కు దశాబ్దాలుగా నేర్చుకోని పాఠం” అని రాసుకొచ్చింది.

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ భారత నగరాలపై వరుసగా డ్రోన్లు, మిసైల్స్‌తో దాడులు చేసింది. దీనికి భారత సైన్యం తగిన రీతిలో సమాధానం ఇచ్చింది. పాకిస్తాన్ నుంచి సీజ్‌ఫైర్ విజ్ఞప్తి వచ్చిన తర్వాత మే 10 సాయంత్రం రెండు దేశాల మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం కుదిరింది. అయితే అప్పటికే భారత సైన్యం పాకిస్తాన్‌కు భారీ నష్టం కలిగించింది. భారత సైన్యం పాకిస్తాన్‌కు చెందిన 11 ఎయిర్‌బేస్‌లను పూర్తిగా ధ్వంసం చేసింది.

వీడియో ఇక్క‌డ‌ చూడ‌వ‌చ్చు..!

#StrongAndCapable#OpSindoor

Planned, trained & executed.

Justice served.@adgpi@prodefencechan1 pic.twitter.com/Hx42p0nnon

— Western Command – Indian Army (@westerncomd_IA) May 18, 2025

ఆపరేషన్ సిందూర్‌ను భారత సైన్యం మే 7, 2025న ప్రారంభించింది. ఈ ఆప‌రేష‌న్‌ ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన చర్య. ప‌హ‌ల్గామ్‌ దాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని లష్కర్-ఎ-తొయిబా (LeT), జైష్-ఎ-మహమ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్‌లో సుమారు 100 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

Also Read: High Blood Pressure: హైపర్‌టెన్షన్.. క‌ళ్ల‌పై ప్ర‌భావం చూపుతుందా?

వీడియోలో చూపిన దాడులు మురిద్కే, బహవల్పూర్, కోట్లీ, ముజఫ్ఫరాబాద్ వంటి ప్రాంతాలలోని ఉగ్రవాద స్థావరాలపై జరిగినవి. ఈ దాడులు ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా, పౌరులకు హాని కలగకుండా జాగ్రత్తగా నిర్వ‌హించారు. ఈ ఆపరేషన్‌లో లోయిటరింగ్ మ్యూనిషన్స్ (సూసైడ్ డ్రోన్స్), SCALP (స్టార్మ్ షాడో) క్రూయిజ్ మిసైల్స్ వంటి అధునాతన ఆయుధాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Indian army
  • Operation Sindhoor
  • Pahalgam Terror Attack
  • pakistan
  • Terror Attack

Related News

Upendra Dwivedi

Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

Operation Sindoor : భారత-పాక్‌ మధ్య యుద్ధాలు అధికారికంగా ముగిసినా, పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఆగలేదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టంచేశారు.

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

  • Attack In Balochistan

    Pakistan : బెలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి – 25 మంది మృతి

  • A massive earthquake shook Afghanistan, killing more than 250 people

    Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి

  • Nobel Peace Prize

    Nobel Peace Prize: నోబెల్ బహుమతి పొందాలని ఆశ‌ప‌డిన ట్రంప్‌.. భారీ షాక్ ఇచ్చిన భార‌త్‌!

Latest News

  • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

  • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

  • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

  • Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

  • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd