HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Violent Clash Between 2 Groups In Akola

Maharashtra Violence: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో హింసాత్మక ఘటనలు

మహారాష్ట్రలో రెండు గ్రూపులు మధ్య చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరింది. ఇరు వర్గాలు రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

  • Author : Praveen Aluthuru Date : 15-05-2023 - 11:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maharastra Voilence
Maharastra Voilence

Maharashtra Violence: మహారాష్ట్రలో రెండు గ్రూపులు మధ్య చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరింది. ఇరు వర్గాలు రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌, అకోలా నగరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి ఘటన అహ్మద్‌నగర్‌లోని షెవ్‌గావ్ పట్టణంలో వెలుగు చూసింది. అదే సమయంలో అకోలాలో చిన్నపాటి వివాదంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ రెండు ఘటనల్లోనూ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ హింసాత్మక ఘర్షణలో పలువురు గాయపడినట్లు సమాచారం. అదే సమయంలో ఘర్షణకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

మే 14వ తేదీ రాత్రి అహ్మద్‌నగర్‌లోని షెవ్‌గావ్‌లో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. వాస్తవానికి ఛత్రపతి శంభాజీ మహరాజ్ జయంతి సందర్భంగా, రాత్రి 8 గంటలకు ఊరేగింపు బయలుదేరింది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక గుంపు రాళ్లు రువ్వింది. మొదట మతపరమైన స్థలంపై రాళ్లతో కొట్టారు. దీంతో ఇరువైపులా రాళ్లదాడి మొదలైంది.

మే 13న అకోలాలో చిన్న వివాదంపై రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. ఈ హింసాకాండలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అకోలాలో 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్‌ను కూడా నిలిపివేశారు.

ఈ గందరగోళం మధ్య ప్రజలు తమ దుకాణాలను మూసివేయవలసి వచ్చింది. ఘర్షణలో పాల్గొన్న కొందరు ఆకతాయిలు పలు దుకాణాలపై దాడి చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 102 మందిపై కేసులు నమోదు చేశారు.

Read More: Dhoni Autograph: ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న భారత క్రికెట్ లెజెండ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 144 section
  • 2 groups
  • akola
  • injured
  • Maharashtra Violence
  • police

Related News

    Latest News

    • నా స్నేహితులు కూడా నాపై కుట్ర చేస్తున్నారు.. శివాజీ కీలక వ్యాఖ్యలు

    • శివాజీకి వార్నింగ్ ? అనసూయకు సపోర్ట్ గా ప్రకాష్‌ రాజ్‌..!

    • ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన భారతీయ సంతతి సీఈవో ఎవ‌రో తెలుసా?

    • పాకిస్థాన్‌లో మేధో వలసలు.. దేశాన్ని వీడుతున్న డాక్టర్లు, ఇంజనీర్లు!

    • విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత.!

    Trending News

      • అంపైర్ల జీతాల పెంపు నిర్ణయం వాయిదా వేసిన బీసీసీఐ!

      • ఈ ఏడాది గంభీర్ కోచింగ్‌లో భారత జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఉందంటే?!

      • న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అత‌నికే!

      • చైనా ఆయుధాల వైఫల్యం.. పేలిపోయిన రాకెట్ సిస్టమ్!

      • పిజ్జా వదిలేసి.. మటన్ ప్రియుడిగా మారిన టీమిండియా యంగ్ క్రికెట‌ర్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd