Tirumala: టీటీడీ రికార్డ్.. ఒక్కరోజు 92,238 మంది భక్తులు దర్శనం
నిన్న ఒక్కరోజు 92,238 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 40,400 మంది తలనీలాలు సమర్పించారు
- By Balu J Published Date - 02:29 PM, Mon - 12 June 23
సాధారణ కేటగిరీ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చేసిన ప్రయోగం అద్భుత ఫలితాన్నిచ్చింది. వెండి వాకిలి నుంచి సింగిల్ క్యూలైన్ విధానం సాటించడంతో ఆదివారం అత్యధిక సంఖ్యలో భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో తిరుమలలో భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది.
శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజు 92,238 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా,40,400 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజు శ్రీవారి హుండీ ఆదాయం (Income) రూ.4.02 కోట్లు వచ్చింది. నిన్న ఒక్కరోజు రికార్డు (Record) స్థాయిలో 92,238 మంది దర్శించుకోవడం విశేషం.
Also Read: Modi Thali: యూఎస్ లో మోడీజీ స్పెషల్ థాలీ.. అదిరిపొయే వంటకాలతో!
Related News
Srisailam: రేపు శ్రీశైలంలో కుంభోత్సవం.. జరిగే పూజలివే
Srisailam: శ్రీశైలంలో శుక్రవారం భ్రమరాంబాదేవికి కుంభోత్సవం జరుగనున్నది. ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో అమ్మవారికి సాత్వికబలిని సమర్పించేందుకు పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో (ఏరోజు ముందుగా వస్తే ఆ రోజున) ఈ ఉత్సవం నిర్వహించబడుతోంది. ఈ కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాత కాలపూజల అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుం�