Delhi Train Accident: ఢిల్లీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
ఈ రోజు శనివారం ఢిల్లీలోని జకీరాలో గూడ్స్ రైలుకు చెందిన పది వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన చార మండిలోని జకీరా ఫ్లైఓవర్ సమీపంలో జరిగింది. ఉదయం 11.50 నిముషాలకు ఈ ప్రమాదం
- By Praveen Aluthuru Published Date - 02:06 PM, Sat - 17 February 24
Delhi Train Accident: ఇటీవల కాలంలో దేశంలో వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వరుస రైలు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాదం మరవకముందే మరికొన్ని సంఘటన చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 బోగీలు పట్టాలు తప్పాయి.
ఈ రోజు శనివారం ఢిల్లీలోని జకీరాలో గూడ్స్ రైలుకు చెందిన పది వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన చార మండిలోని జకీరా ఫ్లైఓవర్ సమీపంలో జరిగింది. ఉదయం 11.50 నిముషాలకు ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు ప్రాధమిక సమాచారం అందించారు. కాగా ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారుల బృందం, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానిక వివరాల ప్రకారం..ముంబై నుంచి చండీఘడ్ వెళ్తున్న ఆ గూడ్స్ రైలులో ఐరన్ షీట్ రోల్స్ ఉన్నాయి. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగే అవకాశాలు లేవని రైల్వేశాఖ తెలిపింది.మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
#WATCH | Eight wagons of a goods train derail on Patel Nagar-Dayabasti section in Delhi area. The incident occurred near the Zakhira flyover.
(Video source: Delhi Police) pic.twitter.com/cQieCNsQAV
— ANI (@ANI) February 17, 2024
Also Read: LS Elections : బాపట్ల కాంగ్రెస్ అభ్యర్థిగా జేడీ శీలం..!
Related News
PM Modi: మోడీకి ఊరట.. ఆరేళ్ళ నిషేధంపై వేసిన పిటిషన్ ని కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.