Shivasena : నేడు మహారాష్ట్ర కెబినేట్ సమావేశం.. రాజకీయ సంక్షోభంపై చర్చ
- By Prasad Published Date - 10:40 AM, Wed - 22 June 22
మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ గందరగోళం మధ్య ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండేతో పాటు ఇతర ఎమ్మెల్యేలు బిజెపిలో చేరవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి.
సూరత్లోని లీ మెరిడియన్ హోటల్లో బస చేసిన ఏక్నాథ్ షిండే తో పాటు 33 మంది పార్టీ ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో బుధవారం ఉదయం అస్సాంలోని గౌహతి చేరుకున్నారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ (MLC) ఎన్నికలలో అనుమానిత క్రాస్ ఓటింగ్ తర్వాత ఇది జరిగింది. దీనిలో భారతీయ జనతా పార్టీ (BJP) ఐదు స్థానాలను గెలుచుకుంది. ఇది మహా వికాస్ అఘాడి (MVA) కూటమి ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని చెప్పాలి.
సోమవారం పోలింగ్ జరిగిన శాసన మండలిలోని మొత్తం 10 సీట్లలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి), శివసేన చెరో రెండు గెలుపొందగా, కాంగ్రెస్ ఒక్క సీటును కైవసం చేసుకోగలిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం షిండేతోపాటు మరికొందరు శివసేన ఎమ్మెల్యేలు సూరత్లోని లే మెరిడియన్ హోటల్లో బస చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితులు మిలింద్ నార్వేకర్, రవీంద్ర ఫాటక్లతో కూడిన శివసేన ప్రతినిధి బృందం కూడా సూరత్లో షిండే, ఇతర పార్టీ శాసనసభ్యులతో సమావేశమైంది.
Related News
Narendra Modi : ఇండియా కూటమి ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు 400 సీట్లు కావాలి
ఒబిసి, ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ కోటాను తగ్గించి ఇవ్వాలని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు తనకు 400 సీట్లు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్నారు.