Nizamabad : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం – స్పీకర్ పోచారం
నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. నష్టపోయిన
- By Prasad Published Date - 07:04 AM, Thu - 27 April 23
నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. నష్టపోయిన రైతులను కలిసి వారికి భరోసా ఇచ్చారు. ఒక రైతుగా తనకు పంట నష్టం బాధ తెలుసని స్పీకర్ అన్నారు. తక్షణమే రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి పంట నష్టంపై ప్రాథమిక అంచనాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని స్పీకర్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాలు కూడా జారీ చేశారని స్పీకర్ గుర్తు చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు కృషి చేస్తానని స్పీకర్ తెలిపారు. గతేడాది పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వ సాయం అందింది. ఈసారి కూడా నష్టపోయిన రైతులకు తగిన సాయం అందించేందుకు కృషి చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.