Telangana: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి నిరసన సెగ
యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. జైకేసారం గ్రామంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ఆయనను కాంగ్రెస్, సిపిఎం నాయకులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.
- By Praveen Aluthuru Published Date - 02:56 PM, Mon - 4 September 23
Telangana: యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. జైకేసారం గ్రామంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ఆయనను కాంగ్రెస్, సిపిఎం నాయకులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాల క్రితం వేసిన శిలాఫలకం పనులకే దిక్కులేదు మళ్లీ కొత్తగా శిలాఫలకం ఎందుకు అని గ్రామస్థులు ప్రశ్నించారు.ఆయనపై కాంగ్రెస్, సిపిఎం నాయకులూ మండిపడ్డారు. అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.9 సంవత్సరాలుగా రేషన్ కార్డులు మంజూరు చేయలేదని నిలదీశారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేస్తానని పనులు చేయకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగనని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో నిరసనకారులు ఆందోళన విరమించారు.
Also Read: CBN IT Issue : చంద్రబాబు అరెస్ట్ సాధ్యమా?
Related News
Smriti Irani: ఎన్నికల పాట్లు.. అర్ద రాత్రి స్కూటీపై కేంద్ర మంత్రి
అమేథీ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమేథీ నియోజకవర్గంలో ఆమె రాత్రి స్కూటర్ నడుపుతూ ప్రజల మధ్యకు వెళ్లారు. అభ్యర్థి స్మృతి ఇరానీ స్కూటర్పై ప్రజల మధ్య తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.