RTC Bus accident: రాజేంద్రనగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు
హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. హైదర్ షా కోట్ వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది.
- By Gopichand Published Date - 11:57 AM, Sat - 31 December 22
హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. హైదర్ షా కోట్ వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బస్సు అద్దాలు పగలగొట్టుకొని ప్రయాణీకులు బయటకు వచ్చారు. దింతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదంలో గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: cracker blast: తమిళనాడులో భారీ పేలుడు.. నలుగురు మృతి
Related News
Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు కు మరో కీలక పదవి దక్కింది
మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కు మరో కీలక పదవి అప్పగించింది అధిష్టానం. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నేషనల్ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు ఇచ్చారు. నేషనల్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మంత్రి శ్రీధర్ బాబు ను ఎంపిక చేసారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఫోకస్ అంత లోక్ సభ ఎన్నికల ఫైనే దృష్టిసారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ�