BRS Party: బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో చోరీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో చోరీకి యత్నించారు, దొంగలు పార్టీ కార్యాలయంలోని రెండు కంప్యూటర్లను దోచుకెళ్లినట్లు తేలింది.
- By Praveen Aluthuru Published Date - 06:59 PM, Wed - 6 December 23
BRS Party: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో చోరీకి యత్నించారు, దొంగలు పార్టీ కార్యాలయంలోని రెండు కంప్యూటర్లను దోచుకెళ్లినట్లు తేలింది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసి ఫర్నీచర్ను పార్టీ కార్యాలయానికి తరలించారు, పార్టీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ లేకపోవడంతో అగంతకులు రెండు కంప్యూటర్లను అపహరించారు. గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయం వెనుక నుంచి అద్దాలు పగలగొట్టి ఆఫీస్లోని రెండు కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి పీఏ వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ 64 స్థానాల్లో గెలిచి రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా కారు పార్టీ 39సీట్లకే పరిమితం అయింది.
Also Read: Kim Jong Un: ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కిమ్ కన్నీళ్లు
Related News
Raghunandan Rao : గల్లీలో.. ఢిల్లీలో లేని.. కారును గెలిపిస్తే మిగిలేది శూన్యమే: రఘునందన్ రావు
Raghunandan Rao:మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంట్ జరిగిన కిసాన్ మోర్చా(kisan morcha) సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, రెవంత్రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని ఆయన అన్నారు. We’re now