Kim Jong Un: ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కిమ్ కన్నీళ్లు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి తెలియని వారుండరు. తన కఠిన చర్యలతో దేశ ప్రజలను తన అధీనంలో ఉంచుకున్న నియంత. ఎవరైనా తన ఆదేశాలను భేఖాతర్ చేస్తే నరకాన్ని మించిన శిక్షలు విధిస్తారు. దేశం కరువుతో అల్లాడిపోతున్నా,
- By Praveen Aluthuru Published Date - 06:51 PM, Wed - 6 December 23
Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి తెలియని వారుండరు. తన కఠిన చర్యలతో దేశ ప్రజలను తన అధీనంలో ఉంచుకున్న నియంత. ఎవరైనా తన ఆదేశాలను భేఖాతర్ చేస్తే నరకాన్ని మించిన శిక్షలు విధిస్తారు. దేశం కరువుతో అల్లాడిపోతున్నా, దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోడు. అలాంటి వ్యక్తి దేశ ప్రజల ముందు ఏడ్చాడు. తనతోపాటు దేశాన్ని ఏడిపించాడు. ఉత్తర కొరియా జననాల రేటు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం. దేశంలోని మహిళలు ఎక్కువ మంది పిల్లలను కనాలని కోరుతూ కిమ్ జాంగ్ కన్నీరుమున్నీరుగా విలపించారు.
గత కొన్నేళ్లుగా ఉత్తర కొరియాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతుండడంతో.. తాజాగా ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్లో తల్లుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. జననాల రేటు తగ్గకుండా నిరోధించడంతోపాటు పిల్లలకు సరైన సంరక్షణ అందించడం మన బాధ్యత. వారికి కూడా మంచి విద్యను అందించాలి. ఇందుకోసం దేశంలోని ప్రతి తల్లితో కలిసి పనిచేయాలని మా ప్రభుత్వం కోరుకుంటోందని అన్నారు. అలాగే.. జాతీయ శక్తిని బలోపేతం చేసేందుకు తల్లులందరూ ఎక్కువ మంది పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఆయన కంటతడి పెట్టారు. ఆయన ప్రసంగం విన్న మహిళలు సైతం భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం కిమ్ జాంగ్ కన్నీళ్లు తుడుచుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
NEW: North Korean dictator Kim Jong Un starts crying as he begs North Koreans to have more babies.
North Korean birth rates are about to skyrocket 📈
The incident happened at the National Mothers Meeting hosted by the dictator who started dabbing his eyes in an effort to get… pic.twitter.com/F8xg0dZ05J
— Collin Rugg (@CollinRugg) December 5, 2023
Also Read: Elbow Darkness: మోచేతులు నల్లగా ఉన్నాయా.. అయితే ఈ సింపుల్ చిట్కాలు పాటించాల్సిందే?
Related News
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో 10 మంది నక్సలైట్లు హతం
ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలకు నక్సలైట్లకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. రాష్ట్రంలోని నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది నక్సలైట్లు మరణించారు. సోమవారం రాత్రి నుంచి అబుజ్మద్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.